May 8, 2026
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్న నేటికి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుందని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్యు) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం చందర్ రావు, పి వై ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి రవి అన్నారు. బుధవారం పి డి ఎస్ యు ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులోకి వచ్చే ముందు వారి మేనిఫెస్టోలో విద్యార్థులకు న్యాయం చేస్తానని చెప్పి పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి నేటికీ 18 నెలలు గడుస్తున్నప్పటికీ విద్యార్థులకు రావాల్సిన 7200 కోట్ల రూపాయలు విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహించడం అంటే పేద విద్యార్థుల పట్ల ఏ విధమైన ప్రేమ ఉందో అర్థం అవుతుందని వారన్నారు. విద్యార్థుల హక్కు అయినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్ మెంట్ ఎత్తివేయాలని కుట్రలో భాగంగానే ఈ విధంగా చేస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దశల వారి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించుతామని హెచ్చరించారు. గత నెలలో అందాల పోటీలకు 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్వహించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. విద్యార్థులకు ఫీజులు ఇవ్వలేని ప్రభుత్వం అందాల పోటీలకు ఏ విధంగా ఖర్చు పెట్టిందని ప్రశ్నించారు. విద్యార్థుల హక్కు అయినటువంటి ఫీజు రియంబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు డివిజన్ ప్రధాన కార్యదర్శి పులి రాఖి, డివిజన్ నాయకులు ఉమేష్, పరమేష్, అలేఖ్య, సంధ్య, రమ్య, సాహితి, సులోచన, మంజుల, తదితర విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

రైతు. కార్మిక హక్కుల పరిరక్షణకై నవంబర్ 26న జరిగేమోటార్ సైకిల్ ర్యాలీని జయప్రదం చేయండి.

TNR NEWS

*నవంబర్ 29,30, డిసెంబర్ 1 తేదీలలో సూర్యాపేట లో జరిగే సిపిఎం జిల్లా మహాసభలు జయప్రదం చేయండి.* *సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి……

TNR NEWS

నరసింహులగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం

TNR NEWS

కమ్యూనిస్టుల పోరాట ఫలితమే శ్రీరామ్ సాగర్ రెండవ దశ నిర్మాణం…  శ్రీరామ్ సాగర్ రెండవ దశకు మాజీ పార్లమెంటు సభ్యులు కమ్యూనిస్టు నేత భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలి.  రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెడతామని ముఖ్యమంత్రి ప్రకటించిన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు డిమాండ్

TNR NEWS

నర్సంపేటలో వేడెక్కుతున్న రాజకీయం

TNR NEWS