Tnrnews.in
తెలంగాణ

షీ టీమ్స్,సైబర్ నేరాలపై అవగాహన

*ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు కోదాడ DSP శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని త్రివేణి డిగ్రీ కళాశాల లో షీ టీమ్స్, సైబర్ నేరాలపైన విద్యార్థిని, విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.* ప్రతి గ్రామంలో, స్కూల్లో, కళాశాలలో చదువుకునే విద్యార్థులు, యువతి యువకులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా,* *ATM* *కార్డ్ వివరాలు,* *OTP* *వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు.* *సైబర్ మోసాలపై* *1930* *టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే *కాలేజి లో హాస్టళ్లు మహిళలపై వేధింపులు జరిగితే షీ టీం వాట్సాప్ నెంబర్*8712686056* *కు* *సమాచారం ఇవ్వాలని తెలిపినారు.* *”టీ సేఫ్” యాప్ పై మహిళలు అవగాహన కలిగియుండాలని అన్నారు* 

*వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను DP లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు.గంజాయి మత్తుమందులకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తప్పకుండా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు*  

            

*యువత లోన్ యాప్ లకు దూరంగా ఉండాలన్నారు. *సామాజిక మాధ్యమాలకు రక్షణగా బలమైన* *పాస్వర్డ్లు పెట్టుకోవాలని అన్నారు. 

 

 *ఈ కార్యక్రమం నందు త్రివేణీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్,షీ టీమ్ కానిస్టేబుల్ నాగేంద్రబాబు, మహిళా కానిస్టేబుల్ సాయి జ్యోతి మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.*

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

తెలంగాణలో రానున్న 2 గంటల్లో భారీ వర్షాలు: వాతావరణ శాఖ….

TNR NEWS

బీసీలను మోసం చేసే పార్టీలకు పుట్టగతులుండవు

TNR NEWS

*రైతాంగానికి ఏమి చేశారని సంబరాలు…..?*   *కేంద్రం డి ఏ పి ధరలు తగ్గించాలి.*   *సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి* 

TNR NEWS

42 శాతం రిజర్వేషన్ కొరకు బీసీలు చేస్తున్న ఉద్యమానికి సకజనులూ మద్దతు ఇవ్వండి

TNR NEWS

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

TNR NEWS

నేషనల్‌ హైవే భూనిర్వాసితులకు 50 లక్షలు ఇప్పియ్యాలే – నాడు రూ.25ల పరిహరం ఇవ్వాలని పీఎం లేఖ రాసిన ఎమ్మెల్యే – అధికారంలోకి వచ్చినంక ఆ ఊసే ఎత్తడం లేదు – మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ డిమాండ్‌. 

TNR NEWS