తెలంగాణ టెట్, ఆర్ఆర్బీ (రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు) పరీక్షలు ఒకే రోజు అయిన జూన్ 17న నిర్వహించనున్న నేపథ్యంలో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఉపాధ్యాయ పోస్టులు, రైల్వే ఉద్యోగాల కోసం అభ్యర్థులు నెలల తరబడి కష్టపడి సిద్ధమయ్యారని, ఒకే రోజు రెండు కీలక పరీక్షలు నిర్వహించడం వల్ల వేలాది మంది అభ్యర్థులు ఏదో ఒక పరీక్షను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం టెట్ పరీక్షను వాయిదా వేయాలని ఆయన సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు.
previous post
