Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఒకే రోజు టెట్, ఆర్ఆర్బీ పరీక్షలు.. వాయిదా వేయాలని డిమాండ్

తెలంగాణ టెట్, ఆర్ఆర్బీ (రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు) పరీక్షలు ఒకే రోజు అయిన జూన్ 17న నిర్వహించనున్న నేపథ్యంలో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఉపాధ్యాయ పోస్టులు, రైల్వే ఉద్యోగాల కోసం అభ్యర్థులు నెలల తరబడి కష్టపడి సిద్ధమయ్యారని, ఒకే రోజు రెండు కీలక పరీక్షలు నిర్వహించడం వల్ల వేలాది మంది అభ్యర్థులు ఏదో ఒక పరీక్షను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం టెట్ పరీక్షను వాయిదా వేయాలని ఆయన సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు.

Related posts

యాసంగి పంటకు సిద్ధమవుతున్న మహిళా రైతు  యాసంగి పంటకైనా బోనస్ త్వరగా ఇవ్వాలి  వానాకాల పంట బోనస్ అకౌంట్లో జమకాలేదు 

TNR NEWS

సీనియర్ జర్నలిస్ట్ ని పరామర్శించిన ఎర్రబెల్లి దయాకర్ రావు 

TNR NEWS

అమ్మానాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ క్రీడాకారులకు రెండు బహుమతులు అందజేత

TNR NEWS

యువత స్వశక్తితో జీవితంలో రాణించాలి….. వినాయక బేకరీని ప్రారంభించిన మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్

TNR NEWS

అల్మాయిపేట మంజీర నదిలో ప్రత్యక్షమైన మొసలి రెండు రోజుల ముందు అందోలు వద్ద కలకలం అప్రమత్తంగా ఉండాలంటున్న స్థానికులు

TNR NEWS

ప్రజాసేవకు విరమణ ఉండదు

Harish Hs