Tnrnews.in
తెలంగాణ

ఒకే రోజు టెట్, ఆర్ఆర్బీ పరీక్షలు.. వాయిదా వేయాలని డిమాండ్

తెలంగాణ టెట్, ఆర్ఆర్బీ (రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు) పరీక్షలు ఒకే రోజు అయిన జూన్ 17న నిర్వహించనున్న నేపథ్యంలో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఉపాధ్యాయ పోస్టులు, రైల్వే ఉద్యోగాల కోసం అభ్యర్థులు నెలల తరబడి కష్టపడి సిద్ధమయ్యారని, ఒకే రోజు రెండు కీలక పరీక్షలు నిర్వహించడం వల్ల వేలాది మంది అభ్యర్థులు ఏదో ఒక పరీక్షను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం టెట్ పరీక్షను వాయిదా వేయాలని ఆయన సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మహిళల హక్కుల కోసం అలుపెరుగని పోరాటాలు చేసేది ఐద్వా మాత్రమే….  ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి 

TNR NEWS

మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్ కు ఘన సన్మానం

Harish Hs

విద్యార్థుల కు మిఠాయి ల పంపిణి చేసిన అమ్మాపురం గ్రామస్తులు 

TNR NEWS

వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే భేటీ

TNR NEWS

జాన్ పహాడ్ ఉర్సు గంధం ఊరేగింపు ప్రారంభించిన మంత్రి

TNR NEWS

మొక్కలు నాటడం మరియు వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత

Harish Hs