మరో 2-3 రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.
కొన్ని ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైతులు, ప్రయాణికులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
