తెలంగాణాలో కులగణన పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కార్యకర్తల వెంబడి ఉండి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలుగా గెలిపిస్తామని అన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి న్యాయం చేస్తామన్నారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ ఆలస్యమైందని, డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. కలెక్టర్ పై దాడి చేస్తే చర్యలు తీసుకోవద్దా? అని ప్రశ్నించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
