Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి 

దౌల్తాబాద్: సమగ్ర శిక్ష ఉద్యోగులను ప్రభుత్వం గుర్తించి వెంటనే రెగ్యులర్ చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శేఖర్ అన్నారు. శనివారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ మండల వనరుల కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి ఎంఈఓ కనకరాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం నడుస్తున్న నేటికి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం లేదని అన్నారు. 15 రోజుల్లో సమస్యలను పరిష్కరించకుంటే సమ్మె చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గాడి రాజు, సంఘం సభ్యులు పెంటయ్య, నగేష్, చంద్రమౌళి, మల్లేశం, కేజీబీవీ సిబ్బంది మమత, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు….

Related posts

నిరుపేదల అపన్న హస్తం సీఎం సహాయనిది

TNR NEWS

నవోదయ ఫలితాల్లో ఎలైట్ క్రియేటివ్ స్కూల్ విద్యార్థి ప్రతిభ

TNR NEWS

బీర్పూర్ లో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

TNR NEWS

ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో అన్న వితరణ కార్యక్రమం ‌

TNR NEWS

ప్రభుత్వ విజయాలు వివరించేందుకు కళాయాత్ర :   తెలంగాణ సాంస్కృతిక సారధి నర్సంపేట టీం లీడర్ నెల్లుట్ల సుమన్.

TNR NEWS

గ్రామ స్వరాజ్యం సాధించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి 

TNR NEWS