Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

మల్లన్న కళ్యాణాన్ని ఇంకా బ్రహ్మాండంగా జరిపించాలి* చట్టప్రకారం నడుచుకుంటే అందరికీ మంచిది* దేవుడి విషయంలో రాజకీయం చేయదల్చుకోలేదు మల్లన్న కళ్యాణాన్ని ఇంకా బ్రహ్మాండంగా జరిపించాలి నియోజవర్గ ప్రజలు చల్లంగా ఉండాలని కోరుకుంటున్నా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

చట్ట ప్రకారం ప్రొటోకాల్ పాటిస్తే అందరికీ బాగుంటుందని,నా అభిప్రాయం..అయితే దేవుడి విషయంలో రాజకీయం చేయదల్చుకోలేదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.ఆదివారం సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవానికి ఎమ్మెల్యే పల్లా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొని,కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంగరంగ వైభవంగా జరిగే కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవానికి వేలాది మంది భక్తులు వచ్చేవారని,ఈ సారి భక్తుల సంఖ్య తగ్గింది.మనందరి ఇలవేల్పు మల్లన్న కల్యాణాన్ని ఇంకా బ్రాహ్మండగా జరపాలని అధికారులను కోరుచున్నా రాజకీయాలకు తావు లేకుండా పట్టు వస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు మంత్రులు,ఎమ్మెల్యేలు తీసుకుని వెళ్లాల్సింది ఉంది.కానీ,ఇవాళ ప్రోటోకాల్ లేకుండా మేం మాత్రమే తీసుకెళ్తాంఅన్నారని,దాని గురించి వివాదం చేయకుండా భక్తజనులతో సహా మేమంతా కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించామన్నారు.దేవుడు విషయం కాబట్టి దీనిని రాజకీయం చేయదల్చు కోలేదు..అయితే చట్టప్రకారం ప్రొటోకాల్ పాటిస్తే బాగుంటుందని నా విన్నపం..

వచ్చే ఏడాది వరకు మల్లన్న కళ్యాణ విషయంలో మౌళిక వసతులు, సౌకర్యాలు పెంచి భక్తులు ఎక్కువగా వచ్చేలా చూడాలని అధికారులకు సూచించారు.అందుకే ఒక్క మాట మాట్లాడకుండా భక్త జనులతో ఉండి అధికారులు ఏం చెప్పారో అదే పాటించాం.జనగామ నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని మల్లన్న స్వామిని ఈ సందర్బంగా కోరుకుంటున్నానని అన్నారు.

Related posts

సైబర్‌నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

TNR NEWS

అభివృద్ధి లో జిల్లా లో కోదాడ అగ్ర స్థానం

Harish Hs

కొనసాగుతున్న సైన్స్ ఫేర్   ఆకట్టుకున్న ఐఆర్ బేస్డ్ ట్రాఫిక్ డెన్సిటీ సిగ్నల్ అడ్జస్ట్మెంట్ 

TNR NEWS

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

Harish Hs

సావిత్రి బాయి పూలే నేషనల్ ఐకాన్ అవార్డు అందుకున్న మల్యాల సతీష్ కుమార్ హైదరబాద్ రవీంద్ర భారతిలో అవార్డు ప్రధానం చేసిన అభిలాష హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్

TNR NEWS

విద్యార్థుల మధ్యాహ్న భోజనం తనిఖీ 

TNR NEWS