Tnrnews.in
తెలంగాణ

స్వర్ణకారులపై పోలీసుల వేధింపులు సరైనది కాదు

స్వర్ణకారులు, వెండి బంగారం వ్యాపారస్తులపై పోలీసుల వేధింపులు సరైనది కాదు అని విశ్వకర్మ సంఘం రాష్ట్ర నాయకులు కొండోజు నరసింహ చారి అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని బులియన్ మర్చంట్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన విశ్వకర్మ చైతన్య సభలో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్పొరేటు నగల షాపులు వచ్చి చిన్న వ్యాపారస్తులు స్వర్ణకారులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నా తరుణంలో ఎప్పుడో బ్రిటిష్ వారు పెట్టిన చట్టాలతో దొంగ బంగారం రికవరీ పేరిట పోలీసులు స్వర్ణకారులను, వ్యాపారస్తులను వేధించడం మానుకోవాలి అన్నారు. చట్టాల్లో మార్పులు చేసి నిజంగా దొంగతనం చేసిన వ్యక్తి పట్టుబడితే అతని ఆస్తులు అమ్మి సొమ్ము రికవరీ చేయాలి లేనిపక్షంలో కఠిన శిక్షలు వేసి జీవితాంతం జైల్లో ఉంచాలి అన్నారు. అనంతరం స్వర్ణకారులు బులియన్ మర్చంట్ అసోసియేషన్ నాయకులు ఐక్యత వర్ధిల్లాలంటూ చేతిలో చెయ్యేసి ఐక్యత చాటుతూ నినాదాలు చేశారు. ఈ సమావేశంలో స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు పోలోజు అంజి, బులియన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు సుందరి వెంకటేశ్వర్లు, ఉప్పల శ్రీనివాసరావు, కోదాడ నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు డాక్టర్ అనంతరపు బ్రహ్మం, కందుకూరి ప్రదీప్, శంకరాచారి తదితరులు పాల్గొన్నారు……

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రైతులెవరు ఆందోళన చెందవద్దు యధావిధిగా యూరియా అమ్మకాలు

Harish Hs

ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన- డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ సతీష్ 

TNR NEWS

ప్లాస్టిక్‌తో పర్యావరణానికి ముప్పు

TNR NEWS

రోడ్డు భద్రత మాస ఉత్సవ కార్యక్రమంలో నల్లబెల్లి పోలీస్ లు

TNR NEWS

_వ్యవసాయ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర శాసన చట్టం చేయాలి._*   *_కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు ఇస్తామన్న ఏడాదికి 12,000 వెంటనే అమలు చేయాలి._*   *_వ్యవసాయ కార్మికులకు విద్య, వైద్యం ఉచితంగా అందించాలి._*   *_తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి._ నాగయ్య* *డిమాండ్* 

TNR NEWS

పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలి

Harish Hs