Tnrnews.in
తెలంగాణ

జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ (టియు డబ్ల్యూజే,ఐజేయు ) *జిల్లా అధ్యక్షులు కోల నాగేశ్వరరావు, ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు గింజల* *అప్పిరెడ్డి* కోరారు. సోమవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో టియుడబ్ల్యూజె యూనియన్ డైరీని ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగిన జర్నలిస్టుల అందరికీ ఇండ్లు స్థలాలు మంజూరు చేయాలన్నారు. జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు లో అవకాశం కల్పించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలును వర్తింపజేయాలని కోరారు. ప్రభుత్వం హెల్త్ కార్డులు సక్రమంగా అమలయ్యేలా చూడాలన్నారు. కార్పొరేట్ వైద్యశాలలో హెల్త్ కార్డులకు సరైన వైద్య సదుపాయం కల్పించడంలో అధికారులు విఫలమైనారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు రాయపూడి చిన్ని, టి యు డబ్ల్యూ జే యూనియన్ దాడుల నిరోధక కమిటీ జిల్లా అధ్యక్షులు బాదే రాము, జిల్లా ఉపాధ్యక్షులు ఆవుల మల్లికార్జున రావు, కోట రాంబాబు, సతీష్ కుమార్, అలుగుబెల్లి హరినాథ్, పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

*మాలల సింహాగర్జనను విజయవంతం చేయాలి* ● సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని పలు గ్రామాల్లో సింహగర్జన వాల్ పోస్టల్ ఆవిష్కరణ

TNR NEWS

జగన్నాధపురం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంఈఓ

Harish Hs

మదీనా తుల్ ఉలూమ్ మదర్సా స్వర్ణోత్సవాలు జయప్రదం చేయాలి…….  కోదాడలో గత 50 ఏళ్లుగా ఆధ్యాత్మిక, సామాజిక విద్యా కేంద్రంగా విరాజిల్లుతున్న మదీనా తుల్ ఉలూమ్ మదర్సా……. జనవరి 4న పూర్వ విద్యార్థుల సమ్మేళనం….. జనవరి 5న భారీ బహిరంగ సభ….మదీనా తుల్ ఉలుమ్ మదర్స స్వర్ణ ఉత్సవాలకు హాజరుకానున్న ఆధ్యాత్మిక గురువులు………

TNR NEWS

గిరిజన గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం

Harish Hs

జిల్లా అదనపు కలెక్టర్ చే సమాచార హక్కు రక్షణ చట్టం 2005 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

Harish Hs

వెంకట్రామ పురం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా కీ త రమేష్ 

TNR NEWS