వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ఫిబ్రవరి 3 న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరగదని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజలందరు ఈ విషయాన్ని గమనించి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు సమర్పించే నిమిత్తం సూర్యాపేట జిల్లా కేంద్రానికి రావద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత యధావిధిగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ ఈ సందర్బంగా తెలిపారు.