Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

బిఆర్ఎస్ పార్టీ లో చేరిన కాంగ్రెస్ నాయకులు

వికారాబాద్ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కావలి మల్లేశం, ఖలీల్ పాషా, కురువ ప్రవీణ్, కురువ మల్లేశం, మహేష్ కుమార్ లతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీని వీడి బీ ఆర్ స్ పార్టీ లో చేరడం జరిగింది. వికారాబాద్ జిల్లా బీ ఆర్ స్ పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వారి నివాసంలో వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలని మోసం చేసిందన్నారు.

ఆరు గ్యారెంటీల సంగతి పక్కన పెడితే ప్రజా ధనాన్ని వృధా చేస్తూ, కనీస ప్రజా సమస్యలని పట్టించుకునే స్థితిలో లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఎంతో మంది నష్టపోయారన్నారు.

తెలంగాణ తిరిగి అన్ని రంగాల్లో అభివృద్ధి, పథంలో ముందుండాలంటే అది కేవలం బీ ఆర్ స్ పార్టీ, కెసిఆర్ తోనే సాధ్యం అన్నారు.

ఈ కార్యక్రమంలో బీ ఆర్ స్ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, నాయకులు ఘయాజ్, మహిపాల్ రెడ్డి, అశోక్, మల్లేష్, కావలి వెంకటేష్, శ్రీనివాస్ గౌడ్, హన్మంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

సమానత్వాన్ని హరించి వేస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం… రాష్ట్రంలో ప్రజలు ఆశించినంతగా లేని కాంగ్రెస్ పరిపాలన… ప్రజల పక్షాన నిలబడి పాలకులను ప్రశ్నించేది ఎర్రజెండానే… సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి…

TNR NEWS

తపాలా శాఖ జీవిత బీమా పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

Harish Hs

తమ్మర లో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కోదాడ మండల నాలుగో మహాసభ

TNR NEWS

తెలంగాణ సాయుధ పోరాట వీరనారి మల్లు స్వరాజ్యం

TNR NEWS

శ్మశాన వాటికలు నిర్మించారు.విద్యుత్ సప్లై మరిచారు

TNR NEWS

పౌరులు చట్టాలకు లోబడి నడుచుకోవాలి

Harish Hs