Tnrnews.in
తెలంగాణరాజకీయం

బిఆర్ఎస్ పార్టీ లో చేరిన కాంగ్రెస్ నాయకులు

వికారాబాద్ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కావలి మల్లేశం, ఖలీల్ పాషా, కురువ ప్రవీణ్, కురువ మల్లేశం, మహేష్ కుమార్ లతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీని వీడి బీ ఆర్ స్ పార్టీ లో చేరడం జరిగింది. వికారాబాద్ జిల్లా బీ ఆర్ స్ పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వారి నివాసంలో వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలని మోసం చేసిందన్నారు.

ఆరు గ్యారెంటీల సంగతి పక్కన పెడితే ప్రజా ధనాన్ని వృధా చేస్తూ, కనీస ప్రజా సమస్యలని పట్టించుకునే స్థితిలో లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఎంతో మంది నష్టపోయారన్నారు.

తెలంగాణ తిరిగి అన్ని రంగాల్లో అభివృద్ధి, పథంలో ముందుండాలంటే అది కేవలం బీ ఆర్ స్ పార్టీ, కెసిఆర్ తోనే సాధ్యం అన్నారు.

ఈ కార్యక్రమంలో బీ ఆర్ స్ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, నాయకులు ఘయాజ్, మహిపాల్ రెడ్డి, అశోక్, మల్లేష్, కావలి వెంకటేష్, శ్రీనివాస్ గౌడ్, హన్మంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సిపిఎం లో 15 కుటుంబాలు చేరిక

TNR NEWS

పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి

Harish Hs

పల్లెల్లో ప్రజలు ఐక్యంగా సంస్కృతి,సాంప్రదాయాలను కాపాడాలి…. డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్…

TNR NEWS

నెహ్రూ ఆశయ సాధనను ముందుకు తీసుకెళ్లాలి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

TNR NEWS

బతికేపల్లిని మండలంగా ఏర్పాటు చేయాలి :- మండల సాధన సమితి ఆధ్వర్యంలో ప్రజావానిలో వినతిపత్రం అందజేత :- ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లకు వినతి

TNR NEWS

జర్నలిస్టులకు ప్రభుత్వ అండగా ఉంటుంది

TNR NEWS