May 19, 2026
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

కుక్కుటేశ్వరుడి నిత్యన్నదానానికి భాస్కరనారాయణ రాజు దంపతులు విరాళం

పిఠాపురం : ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న పిఠాపురం పట్టణంలో వేంచేసిన శ్రీరాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వరస్వామి ఆలయంలో జరిగే నిత్యన్నదానానికి కాకినాడకు చెందిన కలిదిండి భాస్కరనారాయణ రాజు దంపతులు మంగళవారం విరాళం అందజేశారు. శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం నిత్యన్నదానం ట్రస్ట్‌కు ఒక లక్ష వేయ్యి నూట పదహార్లు రూపాయలు రూ.1,01,116లు శాశ్వత అన్నదాన పథకమునకు విరాళం ఇచ్చారు. ప్రతి సంవత్సరం మార్చి 3వ తేదీన అన్నదానం జరిపించవలసిందిగా వారు ఆలయ అధికారులను కోరారు. వారికి దేవస్థాన సహాయ కమిషనర్‌ మరియు కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్‌ శ్రీనివాస్‌ అన్నదాన పథకం బాండ్‌ అందజేసి, శ్రీ స్వామివారి చిత్రపటం, శేషవస్త్రాలు మరియు ప్రసాదాలను అందజేశారు.

Related posts

పిర్ల సూర్యనారాయణ మరణం నెల్లిపూడి గ్రామానికి తీరనిలోటు – జనసేన జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు

జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాలు. జిల్లా డిఎంహెచ్వో వెంకట రవణ.

TNR NEWS

ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు – ఏపీ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

అనపాల సేవలు అభినందనీయం – రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ

Dr Suneelkumar Yandra

ఉద్యోగాల క‌ల్ప‌న‌, నైపుణ్య‌శిక్ష‌ణ ల‌క్ష్యంగా మంత్రి నారా లోకేష్ అడుగులు*

TNR NEWS

పిఠాపురంలో రోడ్ల నిర్మాణం, అభివృద్ధి కోసం రూ.40 కోట్లకుపైగా కేటాయింపు