November 16, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి తొలి రోజు పరీక్ష మొత్తం 2343 మందికి 2339 మంది హజరు …. నలుగురే గైర్హాజరు

కోదాడ పట్టణంలో 10వ తరగతి తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 11 సెంటర్లలో 2343 మందికి గాను 2339 మంది హాజరైనట్లు కేవలం నలుగురే గైర్హాజరైనట్లు తెలిపారు. సెంటర్లవారీగా తేజ స్కూల్ 153 మందికి 153 మంది హాజరు, బాలుర ఉన్నత పాఠశాల 234 మందికి 234 మంది హాజరు, శ్రీ చైతన్య శ్రీనగర్ కాలనీ 198 మంది కి 198 మంది సైదయ్య స్కూల్ 231 మందికి 230 మంది, సిటీ సెంట్రల్ 227 మందికి 227, కే టి ఎస్ 240 మందికి 240 మంది, సీసీ రెడ్డి 239 మందికి 239 మంది, ఎస్ఆర్ఎం స్కూల్ 167 మందికి 166 మంది జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ 239 మందికి 238 మంది శ్రీ వైష్ణవి స్కూల్ 240 మందికి 240 మంది హాజరైనట్లు తెలిపారు మొత్తం మీద 99.82 శాతం విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. *కోదాడ టాలెంట్ స్కూల్ (KTS) పరీక్ష కేంద్రం అడ్రస్సు తప్పుగా ముద్రిoచబడినప్పటికీ విద్యార్థులందరికీ సరైన అవగాహన కల్పించడంతో ఆ సెంటర్లో 100% విద్యార్థులు హాజరయ్యారు.* ప్రతి సెంటర్లో సెట్టింగ్స్ స్వాడ్లను నియమించరన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.

Related posts

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

TNR NEWS

కానిస్టేబుల్ నుండి కాలేజీ లెక్చరర్ దాకా..

TNR NEWS

ఘనంగా హిందూ ముస్లిం ఐక్యత దినోత్సవం…..

TNR NEWS

ఘనంగా చెస్ ఛాంపియన్ మేకల అభినవ్ జయంతి

Harish Hs

వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు నిమ్మ పిచ్చమ్మ మరణం వ్యవసాయ కార్మిక ఉద్యమానికి తీరని లోటు….  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు

TNR NEWS

ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

Harish Hs