Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఆపదలో ఉన్నవారికి కాకతీయ సేవా సమితి అండగా ఉంటుంది

ప్రతిభ కలిగి పేదరికంలో ఉన్న నిరుపేద విద్యార్థులకు కాకతీయ సేవాసమితి ఆధ్వర్యంలో సహకారం అందించి అండగా ఉంటున్నామని సేవా సమితి సభ్యులు తెలిపారు. ఆదివారం బైపాస్ రోడ్ లో నూతనంగా నిర్మిస్తున్న కళ్యాణ మండపం వద్ద నిరుపేద కుటుంబాలకు, సమాజంలో వెనుకబడిన వర్గాలకు, కుల మతాలకు అతీతంగా ప్రతిభ కలిగి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 16 మంది విద్యార్థులకు మాజీ మంత్రి వీరేపల్లి లక్ష్మీనారాయణ ధర్మపత్ని వీరేపల్లి సత్యవతి స్మారకార్థం 3 లక్షల 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి మాట్లాడారు. కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో కులాలకు,మతాలకు అతీతంగా సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజలను ఆదుకునేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నామని తెలిపారు. గతంలో కూడా ఎంతోమందికి తమ సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్థికంగా సహకారం అందించామని గుర్తు చేశారు. సహకారాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగి ఇతరులకు సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పెదనాటి వెంకటేశ్వరరావు, కార్యదర్శి వేమూరి సురేష్, రావెళ్ల సీతారామయ్య, వీరేపల్లి సుబ్బారావు, డాక్టర్ జాస్తి సుబ్బారావు, ముత్తవరపు పాండురంగారావు, రామారావు, గంట సత్యనారాయణ, కొత్త బ్రహ్మయ్య, వీరేపల్లి నాగేశ్వరరావు, కొత్త రాంబాబు, తమ్మినేని భ్రమరాంబ, కాకర్ల వెంకటేశ్వరరావు, బొల్లు రాంబాబు తదితరులు పాల్గొన్నారు………

Related posts

మాస్టిన్ కుల హక్కుల పోరాట సమితి పట్టణ కమిటీ ఎన్నిక

Harish Hs

ముగిసిన రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్

Harish Hs

ఏలూరి పార్వతి అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గల పోటీలు

TNR NEWS

*శ్రీ ధర్మశాస్త అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం ప్రారంభించిన డిఎస్పి రవి*

Harish Hs

ప్లాస్టిక్‌తో పర్యావరణానికి ముప్పు

TNR NEWS

సీనియర్ రిపోర్టర్ పిడమర్తి గాంధీకి గవర్నమెంట్ డాక్టర్లచే ఘన సన్మానం

Harish Hs