November 17, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పెండింగ్ లో ఉన్న క్లైములకు నిధులు విడుదల చేయాలి

వెల్ఫేర్ బోర్డు పెండింగ్ లో ఉన్న క్లైమూలకు నిధులు విడుదల చేయాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం ప్రభుత్వం డిమాండ్ చేశారు.

 ఆదివారం మునగాల భవన నిర్మాణ కార్మిక సంఘం ఐదో మండల మహాసభల సందర్భంగా తాడువాయి వెంకటరాంపురం నేలమర్రి మాధవరం గ్రామాలలో మహాసభల కరపత్రాలను ద్వారా ప్రచారం చేస్తూ భవన నిర్మాణ కార్మికులు ఏర్పాటుచేసిన సమావేశంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం మాట్లాడుతూ వెల్ఫేర్ బోర్డులో దరఖాస్తు చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం గుర్తింపు కార్డులను ఇవ్వాలని ఇప్పటికి నెలల తరబడి పెండింగ్లో ఉన్న గుర్తింపు కార్డులను పరిశీలన చేసి అర్హులైన ప్రతి కార్మికుడికి న్యాయం జరిగే విధంగా చూడాలని 60 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికుడికి వెల్ఫేర్ బోర్డు ద్వారా 9000 రూపాయలు పెన్షన్ మంజూరు చేయాలని ప్రమాద బీమా సౌకర్యం 10 లక్షలకు పెంచాలని సహజ మరణానికి ఐదు లక్షలు ఇవ్వాలని ప్రసూతి మరియు పెండ్లి కానుకల కు లక్ష ఇవ్వాలని పెండింగ్ లో ఉన్న క్లైమూలకు నిధులు విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరినారు.

 ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు షేక్ దస్తగిరి, సెంట్రింగ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు కోలా ఆంజనేయులు సహాయ కార్యదర్శి అల్లి నాగరాజు, మండల కమిటీ సభ్యులు బి రమణయ్య ఆర్ ఏసోబు,బి వెంకన్న పటేల్, ఆర్ వెంకన్న, సైదులు గోవర్ధన్, జీడయ్య, 

 రాజేష్ జె సుందరయ్య, మంగయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related posts

మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి సహకారంతో మార్కెట్ అభివృద్ధికి కృషి

TNR NEWS

రాజీవ్ గాంధీ ఆశయాలను సాధించాలి

TNR NEWS

మాట ఇచ్చి నిలబెట్టుకున్న నాయకులు బాజపా మండల అధ్యక్షుడు రాజపాల్ రెడ్డి   పసుపు బోర్డు ఏర్పాటు ఫై మోడీ, అరవింద్ చిత్రపటాలకు రైతుల పాలాభిషేకం..

TNR NEWS

గజ్వేల్ పట్టణంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు – పీసీసీ అధికార ప్రతినిధి శ్రీ బండారు శ్రీకాంత్ రావు

TNR NEWS

ముత్యాలమ్మ తల్లి దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి

Harish Hs

అంకెల గారడి లా కేంద్ర బడ్జెట్….  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS