Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

గ్రామాలలో మౌలిక సమస్యలు పరిష్కరించాలి.*   సిపిఎం మండల కమిటీ సభ్యురాలు జంపాల స్వరాజ్యం 

మోతే: గ్రామాలలో నెలకొన్న మౌలిక సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని సిపిఎం మండల కమిటీ సభ్యురాలు జంపాల స్వరాజ్యం డిమాండ్ చేశారు. మంగళవారం మండల పరిధిలోని సిరికొండ గ్రామంలో ప్రజా సమస్యలపై సిపిఎం పోరు బాటలో భాగంగా సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందన్నారు. ప్రభుత్వం రెండు సంవత్సరాల అవుతున్న గ్రామపంచాయతీకి ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రజలు సమస్యలు చెబుదామనుకుంటే వినేవారు దిక్కులేరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాల మూలంగా దెబ్బతిన్న వరి పంటకు ఎకరాకు 20వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాల మూలంగా వీధుల్లో నీళ్లు నిలువ ఉండడంతో దోమలు వృద్ధి చెంది ప్రజలు అంటు రోగాలు, విష జ్వరాల బారిన పడుతున్నారని అంటువ్యాధులు, విష జ్వరాల వారి నుండి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడినందుకు ప్రభుత్వం వెంటనే పారిశుద్ధ్య నిధులు విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సిపిఎం పార్టీ నాయకురాలు మల్లమ్మ, పుల్లమ్మ, ఎల్లమ్మ, కవిత, లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పందుల కపరులపై మునిసిపల్ కమిషనర్ చెస్తున్న దాడులు ఆపాలి

TNR NEWS

గురుకుల హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ పై ప్రత్యేక దృష్టి – గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలలో ప్రత్యేక చర్యలు – ప్రతిపక్షాలు విద్యార్థుల పట్ల రాజకీయాలు చేయొద్దు – రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

TNR NEWS

అధ్వాన్న స్థితిలో దౌల్తాబాద్ పాఠశాల.

TNR NEWS

ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Harish Hs

వృద్ధాశ్రమంను ప్రారంభించిన ఎమ్మెల్యే

TNR NEWS

విద్యార్థులకు సైబర్ నేరాల పై అవగాహన

Harish Hs