Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కోతుల బెడద నుండి ప్రజలను కాపాడాలని మున్సిపల్ కమిషనర్ని కోరిన సిపిఎం పార్టీ నాయకులు కోతుల దాడిలో గాయపడిన వారిని పరామర్శించిన సిపిఎం నాయకులు

నారాయణపేట జిల్లా మద్దూర్ మునిసిపాలిటీ పట్టణ కేంద్రంలో కోతులు బీభత్సం సృష్టించాయి. మద్దూరు పట్టణ కేంద్రంలో గత నాలుగు రోజుల నుంచి కోతులు దాడులు చేస్తుండటంతో పలువురు గాయాలపాలై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. గత ఐదు రోజుల నుంచి దాదాపు ఎనమిది మందికి పైకి వ్యక్తులపై విచక్షణారహితంగా దాడులు చేయగా ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. ఈ విషం తెలుసుకున్న సీపీఎం పార్టీ నాయకులు శనివారం రోజు వారిని పరామర్శించారు. తదనంతరం పట్టణ కేంద్రంలో కోతుల సమస్య అధికంగా ఉందని, నాలుగు రోజుల వ్యవధిలోనే ఎనిమిది మంది వ్యక్తులు కోతుల బారిన పడ్డారు అయిన మున్సిపాలిటీ అధికారులు స్పందించడం లేదు ఇపడికైనా వెంటనే స్పందించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి సమాచారం ఇచ్చి కోతులను అడవికి తరిమి వేయాలని మునిసిపాలిటీ అధికారులకు వినతి పత్రం ఇచ్చి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ మండల కార్యదర్శి అశోక్, విజ్ఞాన దర్శిని రాష్ట్ర కార్యదర్శి మొహ్మద్ అలీ మాట్లాడుతూ కోతులు దాడులు చేయడంతో బాధితులు ఒక్కొక్కరు వేల రూపాయలు వైద్యం కోసం ఖర్చుపెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. కావున మున్సిపాలిటీ అధికారులు వెంటనే స్పందించి కోతుల సమస్యను నివారించి వారికి సరైన వైద్యం అందేలా చూడాలన్నారు. ఈ విషయంలో మేము గాయపడిన వారితో మాట్లాడే క్రమంలో చాలా మంది భయాందోళనకు గురవుతున్నారన్నీ వెంటనే చర్యలు చేపట్టి కుతుల బెడద నుండి ప్రజలను కాపాడాలి అన్నారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు భరత్, మండల నాయకులు వెంకట్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

దేశాభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న నిర్మాణ రంగం

TNR NEWS

ఎమ్మెల్యే సహకారంతో వార్డు సమస్యల పరిష్కారానికి కృషి

TNR NEWS

అరుహులందరికీ సంక్షేమ ఫలాలు — ఎమ్మెల్సీ దండే విఠల్

TNR NEWS

నూతన ఎస్సైగా శివకుమార్ బాధ్యతల స్వీకరణ*

TNR NEWS

ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి

TNR NEWS

ప్రశ్నిస్తే అరెస్టుల ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చండి

TNR NEWS