Tnrnews.in
తెలంగాణ

వీరాపూర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు మంజూరి పత్రాల పంపిణీ 

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వీరాపూర్ గ్రామంలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా లకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు మంజూరి పత్రాలను మండల అధికారులు అందజేయడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులుగా 97 మందిని, కొత్త రేషన్ కార్డులు 11 మందికి,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 26 మందికి, రైతు భరోసా 201 మందిని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి మండల ప్రత్యేక అధికారి మధుసూదన్, నోడల్ ఆఫీసర్, ఎంపీడీవో ఏ. ఆంజనేయులు, తాసిల్దార్ ఉట్కూరి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీఓ పాక మంజుల, ఏపీవో రాజబాబు వివిధ శాఖల అధికారులు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

 

తాము అర్హులమే …. మాకు రాలేదు

 

 

తాము గత సంవత్సరం ఉపాధి హామీ పనులలో ఎన్నో రోజులు పనిచేశామని తమకు భూమిలేదని అయినా తమకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో పేరు రాలేదని కొందరు మహిళలు ఆవేదన వ్యక్తపరిచారు. ఇందిరమ్మ ఇండ్లలో సైతం ఒకే ఇంటికి ఇద్దరినీ లబ్ధిదారులను, ఎంపిక చేశారని అర్హులైన తమకు రాలేదని మరికొందరు మహిళలు వాపోయారు.

 

తనకు సంతోషం కలిగింది

 

తాను కొన్ని సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డు కొరకు ఇంటి నిర్మాణం కొరకు ఎదురు చూశానని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తన కొత్త రేషన్ కార్డు ఇందిరమ్మ ఇల్లు రావడం సంతోషం కలిగించిందని వీరాపూర్ గ్రామానికి చెందిన శేఖర్ తెలిపాడు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సురవరం సుధాకర్ రెడ్డి మృతి భారతదేశానికి తీరనిలోటు

Harish Hs

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలకు భారీ డిమాండ్

TNR NEWS

సైకాలజిస్ట్ ల సంఘం జిల్లా అధ్యక్షునిగా రాజశేఖర్

Harish Hs

గొల్లగట్టును రాష్ట్ర పండుగగా గుర్తించాలి మన సాంస్కృతిక చరిత్రను కాపాడుకోవాలి. ఇది గొల్ల గట్టు (పెద్దగట్టు) జాతర చరిత్ర

TNR NEWS

తెలంగాణ జర్నలిస్టు ఫోరం రజతోత్సవాల పోస్టర్ విడుదల

TNR NEWS

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష విధానం గురించి అవగాహన – జిఎంఆర్ విద్యాసంస్థల రెస్పాండెంట్ వంటేరు గోపాల్ రెడ్డి

TNR NEWS