సూర్యాపేట జిల్లా కేంద్రం అంజనాపురి కాలనీలో సోమవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ నరసింహ ఆదేశాలతో డీఎస్పీ ప్రసన్న కుమార్ పర్యవేక్షణలో ఈ తనిఖీలు జరిగాయి. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సరైన పత్రాలు లేని 27 బైక్ లు, 5 ఆటోలను సీజ్ చేశారు. అపరిచితులకు ఇళ్లు అద్దెకిచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలని, అనుమానితుల సమాచారాన్ని డయల్ 100 ద్వారా పోలీసులకు అందించాలని సూచించారు.
