బొల్లారం : గుమ్మడిదలలో యాదవ సంఘం యువకులు ఏర్పాటు చేసిన సదర్ ఉత్సవాల్లో సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్మల గోవర్ధన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ప్రత్యేక వేదిక వద్ద ఏర్పాటుచేసిన శ్రీకృష్ణుడు విగ్రహం జ్యోతి ప్రజ్వలన చేసి సదర్ ఉత్సవాలను ప్రారంభించినారుఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతు సదర్ ఉత్సవాలు యాదవుల ఐక్యతను చాటుతాయని తెలిపారు. యాదవులు నమ్మకానికి నిదర్శనం ఒకే మాట మీద ఉంటారని, పాడి పరిశ్రమ ద్వారా ఉపాధి పొందుతున్న యాదవ సోదరులు పశువుల సంతతి పెరగడానికి దున్నపోతులను పవిత్రంగా చూడడం ఈ సదర్ సమ్మేళన ప్రత్యేకత అన్నారు.
సదర్ ఉత్సవాల సందర్భంగ ఏర్పాటుచేసిన విన్యాసాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో యాదవ సోదరులు, తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
