Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

విద్యార్థుల కు మిఠాయి ల పంపిణి చేసిన అమ్మాపురం గ్రామస్తులు 

 

తొర్రూర్ డివిజన్ :

మహబూబాబాద్ జిల్లా,తొర్రూర్ మండలం అమ్మాపురం ప్రాథమిక పాఠశాలలో బాల దినోత్సవం కార్యక్రమం లో భాగంగా అమ్మాపురం గ్రామస్తులు విద్యార్థులకు మిఠాయిల పంపిణి చేయడం జరిగింది. పిల్లలను చదువు లో ప్రోత్సాహించాలనే ఉద్దేశ్యం తో,బాల దినోత్సవం రోజున పిల్లలు సంతోషంగా ఉండాలని,మిఠాయిలు, బిస్కెట్స్ పంపిణి కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా వారు చిన్నారులతో కొంతసేపు ముచ్చటించడం జరిగింది. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. పిల్లల యోగ క్షేమాలు చూసుకోవడం ఒక్క తల్లి తండ్రుల భాద్యత మాత్రమే కాదు సమాజంలోని విద్యా వేత్తలు, గ్రామ పెద్దలు, యువజన సంఘాలు కూడా ముందుకు రావాలని చెప్పడం జరిగింది.పాఠశాల ప్రధానోపాధ్యాయులు యకూబ్ రెడ్డి మాట్లాడుతూ… జవహర్ లాల్ నెహ్రు యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని ఈ నవంబర్ 14 వ తేదీని మనమందరం బాలల దినోత్సవం గా జరుపుకుంటాం అని పిల్లల కు చెప్పడం జరిగింది. అమ్మాపురం గ్రామస్తులు ఈ బాలల దినోత్సవం లో పాలుపంచుకోడం సంతోషం గా ఉందన్నారు. తదనంతరం చిన్నారులకు బాల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు అమ్మాపురం గ్రామస్తులు పాల్గొన్నారు.

Related posts

నేడు జరగబోయే రాజకీయ యుద్ధభేరిని విజయవంతం చేయాలి.. పొనుగోటి రంగా… జాతీయ బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సూర్యాపేట…

TNR NEWS

అక్విడేషన్ ప్రక్రియను వెంటనే చేపట్టాలి : గడ్డంఅంజి

TNR NEWS

వేంపేట్ పాఠశాలలో ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవము

TNR NEWS

గ్రేటర్ హైదరాబాద్ తరహాలో ఆస్తి పన్ను వన్ టైం సెటిల్ మెంట్ రాయితీ ఇవ్వాలి.  సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్

TNR NEWS

జోగిపేట ఎన్టీఆర్‌ స్టేడియంలో అన్ని వసతులు కల్పిస్తా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సీ.దామోదర్‌ రాజనర్సింహ క్రికెట్‌ విజేతలకు బహుమతుల ప్రధానం 

TNR NEWS

అనాధ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం

Harish Hs