May 9, 2026
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

విద్యార్థుల కు మిఠాయి ల పంపిణి చేసిన అమ్మాపురం గ్రామస్తులు 

 

తొర్రూర్ డివిజన్ :

మహబూబాబాద్ జిల్లా,తొర్రూర్ మండలం అమ్మాపురం ప్రాథమిక పాఠశాలలో బాల దినోత్సవం కార్యక్రమం లో భాగంగా అమ్మాపురం గ్రామస్తులు విద్యార్థులకు మిఠాయిల పంపిణి చేయడం జరిగింది. పిల్లలను చదువు లో ప్రోత్సాహించాలనే ఉద్దేశ్యం తో,బాల దినోత్సవం రోజున పిల్లలు సంతోషంగా ఉండాలని,మిఠాయిలు, బిస్కెట్స్ పంపిణి కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా వారు చిన్నారులతో కొంతసేపు ముచ్చటించడం జరిగింది. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. పిల్లల యోగ క్షేమాలు చూసుకోవడం ఒక్క తల్లి తండ్రుల భాద్యత మాత్రమే కాదు సమాజంలోని విద్యా వేత్తలు, గ్రామ పెద్దలు, యువజన సంఘాలు కూడా ముందుకు రావాలని చెప్పడం జరిగింది.పాఠశాల ప్రధానోపాధ్యాయులు యకూబ్ రెడ్డి మాట్లాడుతూ… జవహర్ లాల్ నెహ్రు యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని ఈ నవంబర్ 14 వ తేదీని మనమందరం బాలల దినోత్సవం గా జరుపుకుంటాం అని పిల్లల కు చెప్పడం జరిగింది. అమ్మాపురం గ్రామస్తులు ఈ బాలల దినోత్సవం లో పాలుపంచుకోడం సంతోషం గా ఉందన్నారు. తదనంతరం చిన్నారులకు బాల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు అమ్మాపురం గ్రామస్తులు పాల్గొన్నారు.

Related posts

బాపూజీ గ్రంథాలయం ఎదుట బీఈడీ అభ్యర్థుల నిరసన

TNR NEWS

రైతుల పాలిటి దైవం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ఆర్

Harish Hs

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి.

TNR NEWS

శ్రీకాంత్ చారి ఆశయాలను సాధించాలి 

TNR NEWS

మేధావుల సంఘీభావ సభకు తరలిరావాలి

Harish Hs

సామజిక,ఆర్థిక,అసమానతలకు విరుగుడు విద్యే నల్గొండలో సావిత్రి బాయిపులే జయంతి పాలడుగు నాగార్జున జిల్లా ప్రధాన కార్యదర్శి.

TNR NEWS