మహబూబాబాద్ జిల్లా :
తొర్రూర్ మండలం, అమ్మాపురం గ్రామం లో శరత్ కంటి హాస్పిటల్, హన్మకొండ వారి చే ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహించడం జరిగింది. వైద్యులు, కంటికి సంబందించిన సమస్యలు, కంటిలో పొర, కంటి శుక్లాలాలు, కంటి చూపు సరిగా వుందోలేదో, కంటి నరాలు,కంటి పాపా చిన్నగా ఉండటం వంటి నేత్ర సమస్యలకు అమ్మాపురం గ్రామ పంచాయతీ లో ఉదయం నేత్ర పరీక్షలు నిర్వహించారు. కంటి పరీక్షలలో భాగంగా బి.పి షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు.కంటి శుక్లాలా సమస్య ఎక్కువ గా ఉంటే సర్జరీ అవసరమని, కంటి చూపు సమస్యలు ఉంటే కంటి అద్దాలను ప్రజల కు సూచించారు. కంటి పరిశుభ్రత కు సంబందించి తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి వైద్యులు ప్రజల కు వివరించారు
ఈ కార్యక్రమంలో సంబంధిత వైద్య బృందం,ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
