Tnrnews.in
తెలంగాణపుణ్యక్షేత్రాలు

16 కోట్ల 16 లక్షల లిఖిత రామ నామాలతో శ్రీరాముని అభిషేకం* – శాశ్వతమైనది రామ నామం ఒక్కటే – భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు

 

కార్తీక మాసంలోని పునర్వసు నక్షత్రం (శ్రీరాముడు జన్మించిన నక్షత్రం) పురస్కరించుకొని బుధవారం నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో అద్దాల మందిరం వద్ద సీతారామచంద్రుల వారికి 16కోట్ల 16లక్షల లిఖిత శ్రీరామ నామాలతో అభిషేకించారు సంస్థ అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్బంగా మాట్లాడుతూ శ్రీరామ అంటే సమస్త శుభాలు కలుగుతాయన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా రామకోటి సంస్థ ద్వారా ప్రతిరోజు లక్షలాది భక్తులు రామ నామాన్ని లిఖిస్తున్నారన్నారు. చదువు రాకపోయినా కూడ కోట్లాది సంఖ్యలో రామ నామాలు లిఖించి తరిస్తున్నారన్నారు. రామకోటి వ్రాయని వారు ఎవరైనా ఉంటే తక్షణమే రామ నామాన్ని లిఖించి రామకోటి లిఖిత మహాయజ్ఞంలో పాల్గొనాలని కోరారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మాల సింహ గర్జన సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు 

TNR NEWS

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందన

TNR NEWS

జీవో నెంబర్ 51 ని సవరించి మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలి

Harish Hs

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి….

TNR NEWS

పబ్లిక్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం.

Harish Hs

సుప్రీంకోర్టు స్టేను స్వాగతిస్తున్నాం…. హెచ్‌సీయు భూములను కార్పొరేట్‌ శక్తులకు అప్పగించొద్దు….  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి 

TNR NEWS