Tnrnews.in
తెలంగాణ

చట్టబద్ధమైన హామీతో…  బిసి డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి  – డెడికేషన్ కమిటీ పేరిట కాలయాపన చేస్తున్న కాంగ్రెస్  – నమ్మించి గొంతు కోయడం కాంగ్రెస్ అసలు నైజం – 42 శాతం రిజర్వేషన్ అమలుతోనే ఎన్నికలకు వెళ్లాలి

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే చట్టబద్ధమైన బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని కామారెడ్డి కాంగ్రెస్ డిక్లరేషన్ లో ప్రకటించిందని, అయితే నేటికీ అతీ గతీలేదని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి ముదిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సావిత్రి బాయి పూలే జయంతి పురస్కరించుకొని హైదరాబాదులో ఎమ్మెల్సీ కవిత చేపట్టిన బీసీ సదస్సుకు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న సందర్భంగా గజ్వేల్ లో ర్యాలీ నిర్వహించి ఆయన మాట్లాడారు. అప్పటి పిసిసి అధ్యక్షులు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 23 శాతం నుండి వెంటనే 42 శాతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్ అమలుకు డెడికేషన్ కమిటీ వేసి చేతులు దులుపుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు. అయితే 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తేనే ఎన్నికలు చేపట్టాలని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే 42 బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా 42 శాతం పేరిట గొప్ప నాటకం ఆడిన కాంగ్రెస్ నిజ స్వరూపం అయిందని, నమ్మించి గొంతు కోయడమే కాంగ్రెస్ లక్ష్యమని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా బీసీ సంక్షేమానికి ప్రభుత్వం నిబద్ధతను చూపిస్తూ ప్రతిష్ట చర్యలు చేపట్టాలని క్రిమిలేయర్ విధానం బీసీలకు సమాన విద్య, ఉద్యోగ అవకాశాలకు అడ్డుగా ఉన్నందున వెంటనే రద్దు చేయాలని పేర్కొన్నారు. బీసీలకు సామాజిక న్యాయం సాధించే క్రమంలో ఐక్యంగా ముందుకు సాగుతామని, కామారెడ్డి డెకరేషన్లో ప్రకటించిన హామీల అమలుకు ఉద్యమిస్తామని, పోరాటం చేపడతామని స్పష్టం చేశారు. అంతేకాకుండా బీసీలకు లక్ష కోట్లతో సమగ్రాభివృద్ధి చేపట్టాలని, ప్రభుత్వ కాంట్రాక్టులో సైతం 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు వర్తింపజేయాలని, ఇచ్చిన హామీ మేరకు ముదిరాజులను బిసి-డి నుండి బీసీ ఏ కుమార్చాలని డిమాండ్ చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మదీనా తుల్ ఉలూమ్ మదర్సా స్వర్ణోత్సవాలు జయప్రదం చేయాలి…….  కోదాడలో గత 50 ఏళ్లుగా ఆధ్యాత్మిక, సామాజిక విద్యా కేంద్రంగా విరాజిల్లుతున్న మదీనా తుల్ ఉలూమ్ మదర్సా……. జనవరి 4న పూర్వ విద్యార్థుల సమ్మేళనం….. జనవరి 5న భారీ బహిరంగ సభ….మదీనా తుల్ ఉలుమ్ మదర్స స్వర్ణ ఉత్సవాలకు హాజరుకానున్న ఆధ్యాత్మిక గురువులు………

TNR NEWS

ఘనంగా ఖాజా భాయ్ (కె.బీ) 35 వ వర్ధంతి కోదాడ లో కబడ్డీ క్రీడకు గుర్తింపు తెచ్చిన ఖాజా భాయ్ (కె.బీ) ఆశయాలను సాధించాలి.

TNR NEWS

కమ్మ కులస్తులు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలవాలి

Harish Hs

నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు లాంచ్ ప్రయాణాన్ని ప్రారంభించిన తెలంగాణ పర్యాటకశాఖ…..

Harish Hs

రైతుల వరి కొనుగోలు కోసం కలెక్టర్ కు వినతి పత్రం

TNR NEWS

కర్ల రాజేష్ కుటుంబాన్ని పరామర్శించిన మాదిగ లాయర్స్ ఫెడరేషన్

TNR NEWS