కోదాడ మాజీ సర్పంచ్ చిట్టబత్తిని సుబ్బరామయ్య సేవలు చిరస్మరణీయమని మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు అన్నారు. సోమవారం సుబ్బరామయ్య వర్ధంతి సందర్భంగా కోదాడ పట్టణంలోని రాజీవ్ చౌక్ చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కుటుంబ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కోదాడ అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు. నేటి నాయకులు వారిని ఆదర్శంగా తీసుకొని వారు చూపిన బాటలో నడవాలి అన్నారు. వారి ఆశయాల సాధన కొరకుప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు,మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు,కుటుంబ సభ్యులు వరప్రసాద్, నరసింహారావు, శివరామయ్య,తొండాపూ సతీష్, బాగ్దాద్,డేగ శ్రీధర్, రాయపూడి వెంకటనారాయణ, ఉప్పుగండ్ల శ్రీను,చంద్రశేఖర్,పతంగి శ్రీను,పాలూరి సత్యనారాయణ, కేశవులు,బషీర్,జానకి రామయ్య, చింతలపాటి శ్రీనివాసరావు,హబీబ్,సుబ్బారావు, సైదా నాయక్,ఆదమ్,పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు………
Save or share this story as a newspaper-style Epaper Clip:
