Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

సూర్యాపేట: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు వెంటనే అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శిమల్లు నాగార్జునరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్న సిపిఎం పార్టీ రాష్ట్ర నాలుగో మహాసభలో హాజరైన ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ జనవరి 26న రైతులందరికీ రైతు భరోసా బ్యాంకులో జమ చేస్తానని చెప్పి నేటికీ జమ చేయకుండా రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. వ్యవసాయ కార్మికులకు ఇస్తానన్న 12 వేల రూపాయలను ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని కోరారు. అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. మహిళలకు ఇస్తామన్న 25 వందల రూపాయలు, ప్రభుత్వం పెంచుతామన్న పింఛన్లు వెంటనే పెంచాలన్నారు. వచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకపోతే భవిష్యత్తులో ప్రజలందరిని సమీకరించి ప్రజా పరాటాలను నిర్మిస్తామని హెచ్చరించారు. ఈ మహాసభలు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నె మ్మాది వెంకటేశ్వర్లు, కోలిశెట్టి యాదగిరిరావు, ములకలపల్లి రాములు, పారేపల్లి శేఖర్రావు నాగారపు పాండు, మట్టిపల్లి సైదులు ,కోట గోపి ,చెరుకు ఏకలక్ష్మి ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

*రైతులను మిల్లర్లు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి

TNR NEWS

నేడు మున్నూరు కాపు సభను విజయవంతం చేయాలి

TNR NEWS

నవోదయ ఫలితాల్లో ఎలైట్ క్రియేటివ్ స్కూల్ విద్యార్థి ప్రతిభ

TNR NEWS

కుమురం భీం స్మారక కబడ్డీ, వాలీబాల్,పోటీల విజేతలకు బహుమతులుప్రదానం..   సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు….

TNR NEWS

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం

TNR NEWS

నిరుపేద వృద్ధులకు 50 దుప్పట్ల పంపిణీ*  *భద్రతా దళ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా* *వివేకానంద వాకర్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో*

TNR NEWS