November 16, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీ నగర్ లో గల ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో శుక్రవారం స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాటలను బోధించారు.విద్యార్థులు కలెక్టర్ గా,జిల్లా విద్యాధికారిగా, ప్రధానోపాధ్యాయులుగా,ఉపాధ్యాయులుగా అలరించారు. ఈ సందర్భంగా వసతిగృహ సంక్షేమ అధికారి, ప్రధానోపాధ్యాయురాలు కే నాగజ్యోతి మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుండి లక్ష్యాలను ఏర్పరుచుకొని వాటి సాధన కొరకు నిరంతరం కృషి చేయాలి అన్నారు. తమపై తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాలను నెరవేర్చాలన్నారు. వసతి గృహాల్లో ప్రభుత్వం మెరుగైన వసతులు కల్పిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు చదువులో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఉషారాణి, సుజాత, రేణుక, పద్మాబాయి, స్వరూప, రేణుక, ప్రియాంక, స్వాతి, నాగేశ్వరరావు, సరిత, లలిత విద్యార్థులు పాల్గొన్నారు………

Related posts

అన్నను దర్శించుకున్న సినీ హీరో శ్రీకాంత్

TNR NEWS

రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం బాధాకరం

Harish Hs

గొల్లగట్టును రాష్ట్ర పండుగగా గుర్తించాలి మన సాంస్కృతిక చరిత్రను కాపాడుకోవాలి. ఇది గొల్ల గట్టు (పెద్దగట్టు) జాతర చరిత్ర

TNR NEWS

అమ్మాపురం ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం  విద్యార్థు బావి భారత నిర్మాతలు : హెడమాస్టర్ వెంకటేశ్వర్లు 

TNR NEWS

సైబర్ మోసాలపై యువత అప్రమత్తంగా ఉండాలి

Harish Hs

చేర్యాల మున్సిఫ్ కోర్టు 29 ప్రారంభానికి చక చకా ఏర్పాట్లు

TNR NEWS