తెలంగాణ : రాష్ట్రంలో వానలు కురవకపోవడం, రిజర్వాయర్లు అడుగంటడంతో భూగర్భజలమట్టాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. గతంలో వేసవిలో 6.22 మీటర్లు ఉండగా, ప్రస్తుతం 9.34 మీటర్లకు చేరుకుంది. 13 జిల్లాల్లో 10 మీటర్లకంటే ఎక్కువ లోతుకు చేరుకున్నాయి. గోదావరి బేసిన్లో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసే ప్రక్రియ ఆగిపోవడంతో చెరువులు, చెక్డ్యామ్లు అడుగంటుతున్నాయి. ప్రభుత్వం బరాజ్ల నుంచి నీటిని ఎత్తిపోసి చెరువులు, ప్రాజెక్టులు నింపితేనే పరిస్థితి అదుపులోకి వస్తుందని అభిప్రాయపడుతున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
