Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబును మరిచిపోయిన అధికారులు.. సొంత ఇలాఖాలోనే ఇలానా?

సీఎం చంద్రబాబును మరిచిపోయిన అధికారులు.. సొంత ఇలాఖాలోనే ఇలానా?

సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రినే మర్చిపోవటం విమర్శలకు తావిస్తోంది. యూనివర్సిటీ అధికారుల నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్ కావటంతో తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. ముఖ్యమంత్రి పేరునే మర్చిపోతారా అంటూ మండిపడుతున్నారు. స్థానిక నేతలైనా ఈ విషయాన్ని చూసుకోవాలి కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో నెటిజనం కూడా ఇదే రీతిలో కామెంట్లు చేస్తున్నారు.

అసలు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళ్తే.. కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీ 27వ వార్షికోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ వార్షికోత్సవానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. ఇక కార్యక్రమానికి ఎవరెవరు వస్తున్నారనే వివరాలతో ఆహ్వాన పత్రికలు ముద్రించి.. పంపిణీ చేశారు. అయితే కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీ ఆహ్వాన పత్రికలో స్థానిక ఎమ్మెల్యే, సీఎం చంద్రబాబు పేరును మాత్రం అధికారులు మరిచిపోయారు. ఆ కార్యక్రమానికి హాజరైనా, కాకపోయినా ప్రోటోకాల్ ప్రకారం లోకల్ ఎమ్మెల్యేగా చంద్రబాబు పేరు అందులో ఉండాలి. కానీ అధికారుల నిర్వాకం కారణంగా చంద్రబాబు పేరు మిస్సైంది. ఇక ద్రవిడ యూనివర్సిటీ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ కావటంతో.. తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. సీఎం పేరునే మరిచిపోతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ద్రవిడ యూనివర్సిటీ ఆహ్వాన పత్రికలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఐఏఎస్ అధికారులు సుమిత్ కుమార్, వికాస్ మర్మత్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దొరస్వామి, ప్రొఫెసర్ సంపత్ కుమార్ పేర్లు ఉన్నాయి. అయితే నియోజకవర్గంలో జరిగే ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా అందులో స్థానిక ఎమ్మెల్యే పేరు ఉండాలి. ఈ ప్రోటోకాల్‌ను పాటించడంలో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా చంద్రబాబు పేరు ఇందులో కనిపించకుండా పోయింది. ఈ ఆహ్వాన పత్రిక ప్రస్తుతం వైరల్ కావడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దీనిపై కామెంట్లు చేస్తున్నారు.

Related posts

పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు పూర్తి

TNR NEWS

శివరాత్రికి ఏర్పాట్లు సర్వం సిద్ధం – కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన శ్రీనివాస్‌

Dr Suneelkumar Yandra

రూ. 20,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై గుణశేఖర్

Dr Suneelkumar Yandra

పిఠాపురంలో రోడ్ల నిర్మాణం, అభివృద్ధి కోసం రూ.40 కోట్లకుపైగా కేటాయింపు

ఏపీలో పాఠశాల విద్యను దేశంలోనే నెం.1గా తీర్చిదిద్దేందుకు ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌న్న మంత్రి

TNR NEWS

అక్రమ మట్టి తవ్వకాలపై ఫిర్యాదు

Dr Suneelkumar Yandra