చేర్యాల టౌన్:-
టీపీసీసీ అధికార ప్రతినిధి ఐఎన్టియూసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మొగుళ్ల రాజి రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి కొమురవెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సిఎం రేవంత్ రెడ్డి తలపెట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని ప్రార్థించినట్లు తెలిపారు. జనగామ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయుటకు నా వంతు సాయంగా అభివృద్ధికి పాటుపడుతున్నట్లు తెలిపారు . జనగామ నియోజకవర్గానికి నిధుల కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అభివృద్ధి కార్యక్రమాలకోసం నిధులు కేటాయింపులు చేయాలని కొరతానని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు చేర్యాల ఎఎంసి మాజీ వైస్ చైర్మన్ కాటం మల్లేశం,మద్దూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్,బెక్కల్ మాజీ సర్పంచ్ కూకట్ల బాలరాజు,కాంగ్రెస్ పార్టీ నాయకులు పొన్నం వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
