Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

దాడుల సంస్కృతిని ఖండిస్తున్నాం. _మద్నూర్ మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్

 

కామారెడ్డి మద్నూర్ మండలం నిన్న వికారాబాద్ జిల్లాలో జిల్లా అధికారులపై జరిగిన దాడిని ఖండిస్తూ ఈ దాడుల సంస్కృతి సరైంది కాదని మద్నూర్ మండల తహసీల్దార్ అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా, దుద్యాల మండలం, లగచర్ల లో ఫార్మా కంపెనీలకు భూ సేకరణ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్ , అదనపు కలెక్టర్, తహసిల్దార్, రెవెన్యూ, తదితర అధికారులపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని మద్నూర్ మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్ అన్నారు. దాడిని నిరసిస్తూ..మంగళవారం మద్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు బ్లాక్ రిబ్బన్ ధరించి సిబ్బందితో కలిసి నిరసన తెలిపారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ నిరసనలు శాంతియుతంగా చేయాలని, దాడుల వల్ల కేసులు అయ్యి జీవితాలు నాశనం చేసుకోవడం కన్న ప్రజలు చెప్పదలచుకున్నది ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉన్న అధికారులకు చెప్పాలని అన్నారు. ఇలాంటి సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం సిబ్బందికి రక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

బెల్లం చాయ్ తాగి చూడు బాయ్ –కోదాడలో క్యూ కడుతున్న చాయ్ ప్రియులు.  — ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు.  — స్వయం ఉపాధి వైపు ఇరువురి సోదరులు అడుగులు  — బెల్లం టీ స్టాల్ తో లభిస్తున్న ఆదాయం  — నిరుద్యోగ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న యువకులు….

TNR NEWS

ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేయాలి. వికారాబాద్ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి. దిశ చైర్మన్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి.

TNR NEWS

ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు

Harish Hs

ప్రతి ఒకరు సేవాగుణం అలవర్చుకోవాలి

Harish Hs

ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర నష్టం కలిగించేఇథనాల్ కంపెనీ అనుమతులు వెంటనే రద్దు చేయాలి.  కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతికి వినతి పత్రం సమర్పించిన  ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు

TNR NEWS

విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయం

Harish Hs