Tnrnews.in
తెలంగాణవిద్య

గ్రూప్ 3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ -III పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు ఎస్పీ మేక నాగేశ్వరరావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో చీఫ్ సూపర్ ఇంటెండెంట్, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు రూట్ ఆఫీసర్లు కు రీజనల్ కోఆర్డినేటర్ ఎస్వీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ డా. వెంకటేశులుతో కలిసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ….. ఈనెల 17 ,18 తేదీలలో నిర్వహించే గ్రూప్ III పరీక్షకు సూర్యాపేటలో మొత్తం 30 పరీక్ష కేంద్రాలు ఉండగా 8951 విద్యార్థులు పరీక్ష కు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్ష కేంద్రానికి అనుమతించేటప్పుడు విద్యార్థుల హాల్ టికెట్, ఏదైనా గుర్తింపు కార్డును తనిఖీ చేసి పంపాలని పేర్కొన్నారు . మొత్తం 68 బయోమెట్రిక్ ఇన్విజిలేటర్ల ను అందుబాటులో ఉంచామని ప్రతి అభ్యర్థి బయోమెట్రిక్ తీసుకోవాలని సూచించారు. ప్రతి కేంద్రంలో ఫర్నిచర్ ,త్రాగునీరు మెడికల్ కిట్ అభ్యర్థులకు అందుబాటులో ఉంచాలని అన్నారు. ఎలక్ట్రానిక్స్ వస్తువులకు అనుమతి లేదని అనుమతి లేదని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని గుర్తు చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రైతులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో చురుగ్గా నైరుతి రుతుపవనాలు  రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు.. వ్యవసాయ పనులకు ఊతం

TNR NEWS

లిఫ్ట్ ఇస్తే బైక్ ఎత్తుకెళ్లిన దొంగ

TNR NEWS

ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి . సిఐటియు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు ఆటోలతో ర్యాలీ. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ మహిపాల్

TNR NEWS

అర్హులైన వారందరికీ నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలి

TNR NEWS

సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మె

TNR NEWS

నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరం

TNR NEWS