Tnrnews.in
తెలంగాణ

హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి బిసి బాలురవసతి గృహాన్ని పరిశీలించిన. బీసీ యువజన సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు గడ్డం లక్ష్మీనారాయణ

ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, శనివారం మండల కేంద్రంలోని స్థానిక బిసి బాలుర వసతి గృహాన్ని వారు సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు, ఈ సందర్భంగా విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో వారుమాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖద్వారా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల భోజనానికి ఉచితంగా అందించే బియ్యం నాణ్యతగా లేకపోవడం వల్లనే రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల విద్యార్థులు విషతుల్య ఆహారంతో అనారోగ్యానికి గురవుతున్నారని గత ప్రభుత్వం నాణ్యమైన సన్నబియ్యాన్ని అందిస్తే నేటి ప్రభుత్వం మాత్రం పురుగులు పట్టిన రాళ్లు మెరిగెలు ఉన్నటువంటి నకిలీ రేషన్ బియ్యాన్ని అందించడం వల్లనే ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు ప్రమాదాల బారిన పడి అనారోగ్యంతో హాస్పిటల్ లో పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు, ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వం ప్రభుత్వ వసతి గృహ మరియు గురుకుల పాఠశాలవిద్యార్థులకు నాణ్యమైన సన్నబియ్యాన్ని అందించాలని వారు డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో పలువురు బిసి యువజన సంఘం నాయకులు రంగా, మహేష్, నరేష్ పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కు సన్మానం 

TNR NEWS

ఘనంగా ఖాజా భాయ్ (కె.బీ) 35 వ వర్ధంతి కోదాడ లో కబడ్డీ క్రీడకు గుర్తింపు తెచ్చిన ఖాజా భాయ్ (కె.బీ) ఆశయాలను సాధించాలి.

TNR NEWS

కోదాడ క్లస్టర్ ఉద్వాన విస్తరణ అధికారిగా రాజు

TNR NEWS

ఘనంగా సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలు

TNR NEWS

భగవద్గీత పఠనంలో స్వర్ణ పతకం జయించిన లక్ష్మి తులసి

Harish Hs

నూతన రేషన్ కార్డులు,సన్న బియ్యం పంపిణీ ద్వారా పేదలకు ఆహార భద్రత

TNR NEWS