Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

అర్హులకు పథకాలు అందేలా సర్వే చేయాలి  అడిషనల్ కలెక్టర్ బి ఎస్ లత 

అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా సర్వే ప్రక్రియను కొనసాగించాలని అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత కార్యదర్శులకు సూచించారు. మల్యాల మండలంలో కొత్త రేషన్ కార్డ్, ఇందిరా భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు సంబంధించిన సర్వేను క్షేత్రస్థాయిలో కార్యదర్శులు సేకరిస్తున్నారు. ఇట్టి ప్రక్రియను సోమవారం అడిషనల్ కలెక్టర్ బి ఎస్ లత మల్యాల మండలంలో సందర్శించారు. కుల గణన సర్వేలో పొందుపరిచిన విధంగా లిస్టులో పేరు రాని అర్హులైన అభ్యర్థుల కుటుంబ సభ్యుల వివరాలు ,ఆధార్ కార్డులు,ఇతర వివరాలు సేకరించి ఉంచాలని ఆమె వారికి సూచించారు. ఈ సర్వేలో తాసిల్దార్ మునీందర్, ఎం పీ ఓ స్వాతి, ఆర్ ఐ రాణి, మల్యాల కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం

Harish Hs

కోదాడ పట్టణ, నియోజకవర్గ నిరుద్యోగులకు గొప్ప సువర్ణ అవకాశం

TNR NEWS

విద్యార్థులకు పరిశీలన విజ్ఞానాన్ని పెంపొందించాలి

TNR NEWS

తొర్రూర్ లో ‘విశ్వబ్రాహ్మణ వేదవిద్వాన్మహాసభ, పంచదాయిల ఆత్మీయ సమ్మేళనం’  విశ్వబ్రాహ్మణుల ఐక్యతను సమాజానికి చాటి చెప్పాలి  ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు , సంస్కృతి పరిరక్షణలో విశ్వబ్రాహ్మణ పురోహితులు  సనాతన ధర్మ పరిరక్షణలో విశ్వబ్రాహ్మణ వేద పండితుల ప్రధాన పాత్ర : రామ గిరి విక్రమ్ శర్మ 

TNR NEWS

ఎమ్మార్పీఎస్ మహిళ జగిత్యాల జిల్లా ఇన్చార్జిగా వనిత 

TNR NEWS

బిజెపి కేంద్ర మంత్రులను కలిసిన జిల్లా నాయకులు.

TNR NEWS