Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీ నగర్ లో గల ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో శుక్రవారం స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాటలను బోధించారు.విద్యార్థులు కలెక్టర్ గా,జిల్లా విద్యాధికారిగా, ప్రధానోపాధ్యాయులుగా,ఉపాధ్యాయులుగా అలరించారు. ఈ సందర్భంగా వసతిగృహ సంక్షేమ అధికారి, ప్రధానోపాధ్యాయురాలు కే నాగజ్యోతి మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుండి లక్ష్యాలను ఏర్పరుచుకొని వాటి సాధన కొరకు నిరంతరం కృషి చేయాలి అన్నారు. తమపై తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాలను నెరవేర్చాలన్నారు. వసతి గృహాల్లో ప్రభుత్వం మెరుగైన వసతులు కల్పిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు చదువులో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఉషారాణి, సుజాత, రేణుక, పద్మాబాయి, స్వరూప, రేణుక, ప్రియాంక, స్వాతి, నాగేశ్వరరావు, సరిత, లలిత విద్యార్థులు పాల్గొన్నారు………

Related posts

క్రీడలతో మానసిక ఉల్లాసం

Harish Hs

ఘనంగా సెమీ క్రిస్మస్ శాంతి సంతోషాలకు చిహ్నం క్రిస్మస్

TNR NEWS

వేడుకల పేరిట డబ్బును వృధా చేయవద్దు

Harish Hs

థాయిలాండ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్*

TNR NEWS

ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలి.  ప్రజా వాణి పిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి.  జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్.

TNR NEWS

వడ్ల కోనుగోలు కేంద్రం ప్రారంభం

TNR NEWS