Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
అంతర్జాతీయం

విద్యార్థుల సృజనాత్మకతశక్తికి ప్రతిరూపమే విద్యాప్రదర్శనలు

విద్యార్థుల సృజనాత్మకత, మేధాశక్తికి ప్రతిరూపంగా విద్యా ప్రదర్శనలు నిలుస్తున్నాయని మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మునగాల మండల కేంద్రంలోని సాయి గాయత్రి విద్యాలయంలో సైన్స్ ఫెస్ట్ ‌ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు..ఆలోచనలు భిన్నంగా ఉంటే ఆ విష్కరణలు సైతం భిన్నంగా ఉంటాయని అన్నారు. ఇలాంటి ప్రదర్శనలు విద్యార్థులలో పోటీ తత్వాన్ని పెంచుతాయని అన్నారు.మనం అనుభవిస్తున్న విజ్ఞాన పలాలు ఎంతో మంది శాస్త్రవేత్తల కృషి శ్రమ పలితమని అన్నారు.సైన్స్ కు మన జీవితంతో విడదీయరాని సంబంధం ఉందని, ఈరోజు మనం అనుభవిస్తున్న అన్ని రకాల సౌలభ్యాలు,సౌకర్యాలు సైన్స్ వల్లనేనని,అందుకు కృషిచేసిన శాస్త్రవేత్తలకు మనం రుణపడి ఉన్నామని, విద్యార్థులు మాత్రమే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరు శాస్త్రీయ అవగాహన కలిగి ఉన్నప్పుడే,సమాజంలోని మూఢత్వాన్ని తొలగించగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ అర్వపల్లి శంకర్, పాఠశాల చైర్మన్ ఉషారాణి, ఏవో ప్రభాకర్ రెడ్డి , ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

బహుదొడ్డి రామారావు జీవితం నేటి తరానికి ఆదర్శం- ములకలపల్లి రాములు

Harish Hs

అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్

Dr Suneelkumar Yandra

*తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం*

TNR NEWS

థాయిలాండ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్*

TNR NEWS

బాపూజీ గ్రంథాలయం ఎదుట బీఈడీ అభ్యర్థుల నిరసన

TNR NEWS

సీనియర్ సిటిజన్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. త్వరలోనే ఆకర్షణీయమైన కొత్త పథకం!

TNR NEWS