విజయవాడ : వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఎర్త్ అవర్ గ్లోబల్ ఉద్యమంలో భాగంగా మార్చి 22వ తేదీ శనివారం రాత్రి 8.30 గంటల నుండి 9.30 గంటల వరకు ఒక గంట పాటు అన్ని అనవసరమైన లైట్లను స్వచ్చందంగా ఆపివేసి ‘ఎర్త్ అవర్’ పాటించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ యొక్క ఎర్త్ అవర్ ప్రచారం ప్రపంచవ్యాప్తంగా ఒక గంట పాటు అనవసరమైన లైట్లను స్వచ్చందంగా ఆపివేయడం ద్వారా వాతావరణ పరిరక్షణ ఉద్యమంలో ప్రజలను ఏకం చేస్తూ, భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని అందించడంలో సహాయపడుతుందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
