Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

మార్చి 22న ‘ఎర్త్ అవర్’ పాటించండి – గవర్నర్ అబ్దుల్ నజీర్

విజయవాడ : వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఎర్త్ అవర్ గ్లోబల్ ఉద్యమంలో భాగంగా మార్చి 22వ తేదీ శనివారం రాత్రి 8.30 గంటల నుండి 9.30 గంటల వరకు ఒక గంట పాటు అన్ని అనవసరమైన లైట్లను స్వచ్చందంగా ఆపివేసి ‘ఎర్త్ అవర్’ పాటించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ యొక్క ఎర్త్ అవర్ ప్రచారం ప్రపంచవ్యాప్తంగా ఒక గంట పాటు అనవసరమైన లైట్లను స్వచ్చందంగా ఆపివేయడం ద్వారా వాతావరణ పరిరక్షణ ఉద్యమంలో ప్రజలను ఏకం చేస్తూ, భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని అందించడంలో సహాయపడుతుందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు.

Related posts

విజయవాడ వరద బాధితులకు సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ*

TNR NEWS

గణేష్ ఉత్సవాలకి ప్రభుత్వం ఆంక్షలు విధించవద్దు – విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకటేశ్వరరావు

Dr Suneelkumar Yandra

పిఠాపురంలో చేయూత నిత్యాన్నదానం ప్రారంభం

Dr Suneelkumar Yandra

జనసేన పార్టీలోకి వైసిపి సర్పంచ్ దొడ్డి ప్రసాద్

Dr Suneelkumar Yandra

సేంద్రీయ ఉత్పత్తులతో ఆరోగ్యానికి మేలు..

TNR NEWS

ఏలేరు పేస్-2 రద్దు చేయడమే వల్లే వరద ముంపు సంభవించింది – మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ

Dr Suneelkumar Yandra