Tnrnews.in
తెలంగాణ

కోదాడలో ఘనంగా నాభి శిలా బొడ్రాయి ఏడవ వార్షికోత్సవం

కోదాడ పట్టణంలో గ్రామ దేవత నాభి శిల బొడ్రాయి ఏడవ వార్షికోత్సవం శుక్రవారం కమిటీ సభ్యులు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు బారులు తీరారు. వేద పండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ పూజా కార్యక్రమాలని కనుల పండువగ జరిపారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి బిందెలతో జలాభిషేకాలు జరిపి బోనాలు సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి బొడ్రాయి వద్ద పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ చైర్మన్ రామినేని శ్రీనివాసరావు,శ్రీదేవి దంపతులు పీటలపై కూర్చొని బొడ్రాయి వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి జలాభిషేకాలు జరిపి అమ్మవారికి తొలి బోనం సమర్పించి మొక్కులు చెల్లించారు. పట్టణ నలుమూలల నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలి రావడంతో బొడ్రాయి వద్ద పండుగ వాతావరణం నెలకొన్నది. ఈ కార్యక్రమంలో బొడ్రాయి పున ప్రతిష్ట కమిటీ సభ్యులు, ముత్యాలమ్మ కమిటీ, రైతు కమిటీ సభ్యులు పాల్గొన్నారు……….

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

29న జరిగేబహిరంగ సభను జయప్రదం చేయండి. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు

TNR NEWS

సర్వే పారదర్శకంగా చేపట్టాలి: కలెక్టర్ పమేలా సత్పతి

TNR NEWS

కాల్వశ్రీరాంపూర్ లో పెద్దమ్మతల్లి బోనాలు

TNR NEWS

గ్రామ పంచాయతీ నిర్లక్ష్యం ప్రజలకు ప్రాణ సంకటం…

TNR NEWS

ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నాం

Harish Hs

లోకబాంధవుడిగా కీర్తిగాంచి విశ్వ మానవాళికి ప్రేమతత్వంతో వెలుగులు పంచిన కరుణామయుడు ఏసుక్రీస్తు

Harish Hs