భారత దేశంలో మంచినీటిని కొనుక్కోవలసిన దుస్థితికి దేశం దిగజారిందని బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు శుక్రవారం నాడు మునగాల ఎంపీడీవో పండిట్ దీన్ దయల్ గారికి డిమాండ్లతో కూడిన వినపత్రం సమర్పించి మాట్లాడుతూ యాజకులు మతిస్థిమితం లేని వారు పేద ప్రజలు డబ్బులు లేక మంచి నీళ్లు కొనుక్కోలేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఇప్పటికైనా మిషన్ భగీరథ వారు పబ్లిక్ ప్రాంతాలలో పబ్లిక్ నల్లాలు పెట్టించి ప్రజల దాహార్తిని తీర్చాలని అలాగే బోరింగులు కూడా వేయించి మంచినీటి వసతిని కల్పించాలని అన్నారు ఇలా చేయడం వల్ల పక్షులకు కూడా కొంతమేరకు ఉపశమనం దొరుకుతుందని అన్నారు ఇప్పటికైనా అధికారం యంత్రాంగం నిర్ణయం తీసుకొని పబ్లిక్ నల్లాలు బోరింగుల వేయించడం మీద దృష్టి పెట్టి ప్రజల దాహార్తిని తీర్చాలని ఆయన అన్నారు
Save or share this story as a newspaper-style Epaper Clip:
