తెలంగాణ : రేవంత్ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మంచి స్పందన వస్తోంది. ఇప్పటివరకు ఇళ్లకోసం దాదాపు 77 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలి విడత L1లో సొంత స్థలం ఉండి ఇళ్లు లేని 23 లక్షల మందిని ప్రభుత్వం ఎంపిక చేసి రూ.6,500 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం రెండో విడత మంజూరు చేయనుంది. ఇక స్థలం లేనివారికి ప్రభుత్వ స్థలాల్లో కట్టించాలని భావిస్తోంది. కాగా తొలి విడతలో పూర్తైన ఇళ్లు ఆమోదయోగ్యంగా ఉండటంతో, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై లబ్ధిదారులకు ఆసక్తి పెరిగింది.
Save or share this story as a newspaper-style Epaper Clip:
