Tnrnews.in
తెలంగాణ

ఆలూర్‌ గ్రామాన్ని మండలం చేయాలని ఎమ్మెల్యేకు వినతి

తెలంగాణ ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీల ఏర్పాటులో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని చేవెళ్ల గ్రామాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో నిర్ణయించిన నేపథ్యంలో చేవెళ్ల మండలంలో ఉన్న అన్ని అర్హతలున్న మేజర్ గ్రామ పంచాయతీ ఆలూర్ ను, ఆ గ్రామానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలను కలుపుతూ నూతన మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఆ గ్రామ అఖిలపక్షం నాయకులు సోమవారం ఎమ్మెల్యే కాలే యాదయ్యని తన స్వగ్రామమైన చించల్ పేట్ లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులతో ఎమ్మెల్యే చర్చించి, దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, ప్రజల అవసరాల దృష్ట్యా ఆలూర్ ను మండలం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని సానుకూలంగా స్పందించినట్లు అఖిలపక్షం నాయకులు తెలిపారు. ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చిన వారిలో కసిరే వెంకటేష్, కవ్వగూడెం నర్సిములు, తోట చంద్రశేఖర్, అశోక్, నరేందర్, శ్రీశైలం, షబ్బీర్, యస్ నర్సిములు, యాదిరెడ్డి, శేఖర్, సీహెచ్ నర్సిములు, శ్రీనివాస్, ఎస్ ప్రభాకర్, కుమార్, టీ ప్రభాకర్, మహేష్, మహేందర్, మోహన్, సునీల్, బెన్నీ తదితరులు ఉన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రైతును ఆదుకోవడంలో విఫలమైన ప్రభుత్వం

Harish Hs

ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట   వాగులోకి ట్రాక్టర్లు వెళ్లకుండా కందకం తీసిన పోలీసులు

TNR NEWS

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

TNR NEWS

డ్రగ్స్,సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

TNR NEWS

వర్షపు నీటిని ఒడిసిపట్టడమే భవిష్యత్‌కు భరోసా మొరిశెట్టి నివేదిత లక్షాది, హన్మంత రెడ్డి.

TNR NEWS

ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు

TNR NEWS