Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

దాతల సహకారం అభినందనీయం ● మండల విద్యాధికారి పురన్ దాస్

చేవెళ్ల    మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రానికి పూర్వవైభవం రావడానికి సహకరించిన దాతలు అభినందనీయులని చేవెళ్ల మండల విద్యాధికారి పురన్ దాస్ అన్నారు. చేవెళ్ల మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏంఈఓ మాట్లాడుతూ.. విద్యార్థుల జీవిత కాల గుర్తింపు కార్డుగా అపార్ కార్డు ఉపయోగపడుతుందని వాటి నమోదు కేవలం 50 శాతం మాత్రమే నమోదైందని, అపార్ కార్డు నమోదును వేగవంతం చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. అనంతరం మండల విద్యావనరుల కేంద్రానికి మరమ్మతులు చేయించడానికి, పెయింటింగ్ వేయడానికి, ఫర్నిచర్ సమకూర్చడానికి సహకారం అందించిన దాతలు చేవెళ్ల మాజీ సర్పంచ్ బండారి శైలజా ఆగిరెడ్డి, చేవెళ్ల పీఎసీఎస్ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి సమతా, చేవెళ్ల వాస్తవ్యులు, పెద్దలు తిరుపతి రెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయులు హనుమంత్ రెడ్డిలను ఆహ్వానించి వారిని ఘనంగా సన్మానించారు. వారి సహకారంతోనే విద్యావనరుల కేంద్రం కొత్త శోభను సంతరించుకుందన్నారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తాము ఎప్పుడూ ముందుంటామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మంచి నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని, విద్యార్థుల అభ్యున్నతికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని కొనియాడారు. రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ ఖాజా పాషా ప్రభుత్వ పాఠశాలలకు సహకారం అందిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆగిరెడ్డి, చేవెళ్ల మాజీ ఉప సర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్ యాదవ్, మాజీ వార్డు సభ్యులు మల్లారెడ్డి, శ్రీకాంత్, ప్రవీణ్, ప్రధానోపాధ్యాయ సంఘం డివిజన్ నాయకులు వెంకటయ్య, జిల్లా మరియు మండల ఉపాధ్యాయ సంఘాల నాయకులు అక్బర్, మునీర్ పాష రాజశేఖర్, ప్రవీణ్, దయానందం, హరి, నర్సింలు, వెంకటేష్, మున్నూరు రాజశేఖర్, శివానందం, దయానందం తదితరులు పాల్గొన్నారు.

Related posts

నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ నేషనల్ అవార్డు- 2025 కి ఎంపిక

Harish Hs

మండవ శాంతి కుమార్ మృతి-సిపిఎం పార్టీ కి తీరని లోటు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి.

TNR NEWS

కేజీబివిలో గెస్ట్ ఫ్యాకల్టీలకు దరఖాస్తుల ఆహ్వానం

TNR NEWS

గణేష్ మండపాలకు అనుమతి తప్పనిసరి: ఎస్సై గోపాల్ రెడ్డి

TNR NEWS

అకాల వర్షాల దృష్ట్యా రానున్న 3 రోజులు రైతులు అప్రమత్తంగా ఉండాలి…. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

TNR NEWS

క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన. మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్.

TNR NEWS