Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

వేసవి ఎండల్లో కిలో వాట్స్ విద్యుత్ భారాలు తగవు – పౌర సంక్షేమ సంఘం డిమాండ్

కాకినాడ : వేసవిలో అధికంగా వుండే గృహవిద్యుత్ వాడకాన్ని సంపద సృష్టికి ఆసరాగా చేసుకుని గృహ విద్యుత్ వినియోగదారులపై రాయితీలు ప్రకటిస్తూ అదనపు లోడ్  భారాలు మోపడం తగదని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది.  కిలో వాట్ కు రూ.1200లు మించితే రూ.2,450  రెండు కిలో వాట్స్ దాటితే రూ.3,650లు అదనంగా వసూలు చేసేందుకు టార్గెట్స్ పెట్టడం అంట కత్తెర  చోద్యంగా వుందన్నారు.  ట్రూఅప్ తదితర తాడు బొంగరం లేని అదనపు చార్జెస్ పేరిట విద్యుత్ బిల్లులు అధికం కాగా, వేసవి ఎండల్లో కిలో వాట్ టార్గెట్స్  తగదన్నారు. ట్రాన్స్ కో ప్రకటించిన 50శాతం రాయితీ  వేసవికి అడ్వాన్స్డ్ క్షవర కళ్యాణంగా వుంద న్నారు. యూనిట్ రేట్లు ఇప్పటికే అధికంగా వున్నందున అదనపు  భారాలు రెండు కిలో వాట్స్ వరకు గృహ వినియోగదారులపై  లేకుండా రద్దు చేయాలని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు డిమాండ్ చేశారు.

Related posts

ప్రభుత్వాసుపత్రిని కాకినాడ జిల్లాకు పరిమితం చేయాలి

ఉచితంగా చికెన్‌, కోడి గుడ్లు పంపిణీ

Dr Suneelkumar Yandra

తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదుకు సిద్దం కండి

TNR NEWS

కాకినాడగణపతిపీఠంలో 53మంది ఉపవాసకులతో ఘనంగా జరిగిన మాఘ సంకష్టహర చతుర్థి

Dr Suneelkumar Yandra

సంక్రాంతి విశిష్టత ఏమిటి.. పెద్ద పండుగ ఎలా అయ్యింది !

Harish Hs

కుక్కుటేశ్వరుడి హుండీ ఆదాయం రూ.11,74,660/-