Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

ఉప్పుటేరు మూడవ వంతెనకు “సివికె రావు” నామకరణం చేయాలి

కమ్యూనిస్ట్ గాంధీకి 113వ జయంతి నివాళి

 

కాకినాడ : చిత్తజల్లు వెంకట కృష్ణారావు (సివికె రావు) 113వ జయంతి సందర్భంగా సినిమా రోడ్ సంత చెరువు పార్కువద్ద సివికెరావు విగ్రహానికి సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కళావంతుల బిసి సామాజిక వర్గానికి చెందిన సివికె రావు విదేశాల్లో ఐసిఎస్ (ఐఎఎస్ ను మించిన) ఉన్నత విద్య పూర్తి చేసి స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని కాకినాడ పురపాలక కౌన్సిలర్ గా, చైర్మన్ గా, ఎమ్మెల్యేగా ప్రజాహిత ప్రయోజన ఉద్యమాలు చేపట్టి రాష్ట్ర చరిత్రలో కమ్యూనిస్ట్ గాంధీగా నిస్వార్థ సేవలందించిన దేశభక్తుడని రమణరాజు పేర్కొన్నారు. చైర్మన్ గా ఎమ్మెల్యేగా ఏకకాలంలో రెండు ఉన్నత పదవులు నిర్వహించిన ఏకైక ప్రజానేతగా ఖ్యాతి చెందారన్నారు. జగన్నాధపురం ఉప్పుటేరు మీద నిర్మించే 3వ వంతెనకు సివికె రావు వారధిగా నామకరణం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Related posts

శాంతిస్థాపనతోనే సామాజిక న్యాయం సాధ్యం

Dr Suneelkumar Yandra

మార్చి 14న జరగబోయే జనసేన ఆవిర్భావ సభకు ప్రజలందరినీ ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్న

Dr Suneelkumar Yandra

అధ్యాపకుల సమస్యలు పరిష్కరించండి

Dr Suneelkumar Yandra

మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలి

సేంద్రీయ ఉత్పత్తులతో ఆరోగ్యానికి మేలు..

TNR NEWS

స్వరూపానంద కు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..

TNR NEWS