కాకినాడ : నాడు నేడు పథకంలో నిర్మాణాలు చేపట్టిన సర్వేపల్లి రాధాకృష్ణన్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ పనులపై వచ్చిన బహిరంగ ఆరోపణలు గ్రీవెన్స్ పిర్యాదులు పత్రికా వార్తలు మున్నగు వాటిపై అధ్యయనం నిర్వహించి సాక్షులతో లోతైన విచారణ నిర్వహించాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అన్ని పాఠశాల ల్లో త్రాగు నీటి ఆర్ ఓ ప్లాంట్లు టాయిలెట్లు సైకిల్ షెడ్లు ఆవరణలు మునిగిపోకుండా మెరక చేయించే పనులు పూర్తి స్థాయిలో విద్యుత్ దీపాలు నిర్వహణ చేయించే పనులు యాక్షన్ ప్లాన్ గా వేసవిలో చేపట్టాలని కోరారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
