Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

తమ్మర లో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కోదాడ మండల నాలుగో మహాసభ

ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేసి రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు దొడ్డ వెంకటయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లు ప్రసాద్ లు అన్నారు. బుధవారం కోదాడ పరిధిలోని తమ్మరలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కోదాడ మండల నాలుగో మహాసభల సందర్భంగా రైతు సంఘం జెండాను ఆవిష్కరించి అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగ సమస్యలను పరిష్కరించి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగి రెండు లక్షల రుణమాఫీ కానీ మిగిలిపోయిన రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలన్నారు. రైతు భరోసా నిధులు పూర్తిస్థాయిలో నేటి వరకు జమ కాలేదని కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి ఆదుకోవాలని అన్నారు. సాగర్ ఆయకట్టు చివరి భూములకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి బత్తినేని హనుమంతరావు, రైతు సంఘం సహాయ కార్యదర్శి అన్నెం పాపిరెడ్డి, పోతురాజు రాజేశ్వరరావు, దంతాల శేషయ్య, కొండ కోటేశ్వరరావు, రామకృష్ణ, బత్తినేని శ్రీను తదితరులు పాల్గొన్నారు……..

Related posts

ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించాలి  ఎస్సై విజయ్ కొండ

TNR NEWS

ఆయిల్ ఫామ్ సాగు చేస్తే అధిక లాభాలు

TNR NEWS

శ్రీకాంత్ చారి ఆశయాలను సాధించాలి 

TNR NEWS

సెయింట్ థెరీసా స్కూల్లో ఘనంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు బడుగు బలహీన విద్యార్థులకు విద్యను అందిస్తున్న మిషనరీ సంస్థ పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి 

TNR NEWS

యాసంగి పంటకు సిద్ధమవుతున్న మహిళా రైతు  యాసంగి పంటకైనా బోనస్ త్వరగా ఇవ్వాలి  వానాకాల పంట బోనస్ అకౌంట్లో జమకాలేదు 

TNR NEWS

కోదాడ ప్రజలకు విజ్ఞప్తి / న్యూసెన్స్ చేసేవారికి పోలీస్ వారి హెచ్చరిక నూతన సంవత్సర వేడుకల పేరుతో తోటి పౌరులకు అసౌకర్యం కలిగే విధంగా ప్రవర్తిస్తూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు  కోదాడ డిఎస్పీ మామిళ్ళ శ్రీధర్ రెడ్డి

TNR NEWS