సూర్యాపేట:కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా సర్ కార్యక్రమం పేరుతో అర్హుల ఓట్లను తొలగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని సిపిఎం వాణిజ్య భవన్ శాఖ కార్యదర్శి బొమ్మిడి లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్ లో సర్ పేరుతో అర్హుల ఓట్లను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఎన్నికల జాబితాల్లో పేర్ల సవరణ, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు మారిన వారి పేర్ల తొలగింపు వంటి ప్రక్రియలు పారదర్శకంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు.ప్రస్తుతం అమలు చేస్తున్న సర్ విధానం అనేక సందేహాలకు తావిస్తోందని అన్నారు.దేశంలోని పలు రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీలు, ప్రజాస్వామ్య శక్తులు ఈ ప్రక్రియలో అక్రమాలు జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయన్నారు.
ఓటరు జాబితాల ప్రక్షాళన పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడకుండా ఎన్నికల సంఘం పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని కోరారు..ప్రతి ఓటరికి తగిన సమాచారం అందించి, అభ్యంతరాలు తెలిపేందుకు తగిన సమయం ఇవ్వాలన్నారు. ప్రజల ఓటు హక్కును హరించే విధంగా ఎలాంటి చర్యలు చేపట్ట రాదన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత ప్రాథమిక రాజ్యాంగ హక్కు అని గుర్తు చేశారు. అందువల్ల ఎన్నికల సంఘం రాజకీయ పక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, ప్రజల్లో అనుమానాలకు తావులేకుండా సర్ ప్రక్రియను నిర్వహించాలని కోరారు.ఎన్నికల జాబితాల సవరణ పేరుతో ప్రజాస్వామ్య హక్కులపై దాడి జరిగితే సిపిఎం తీవ్రంగా ప్రతిఘటిస్తుందని అన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే నిబంధనలను ఉపసంహరించుకోవాలని, లేనియెడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సభ్యులు హాఫీస్ బాయ్, త్రివేణి, జగన్ తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
