Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

మేం చిన్నోలం కాదు కొట్లాడి తెలంగాణ తెచ్చినోల్లం.. కప్పర ప్రసాద్ రావు టీ జె యూ రాష్ట్ర అధ్యక్షులు.. 

తెలంగాణ జర్నలిస్టులు అంటే చిన్నోళ్ళు కాదని కొట్లాడి తెలంగాణ తెచ్చినోళ్ళని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు అన్నారు. జిల్లా అధ్యక్షులు దేవరంపల్లి అశోక్ అధ్యక్షుతన జరిగిన సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశంకు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ కోసమే పేపర్లు ఛానల్ పెట్టి నేను తెలంగాణ వచ్చిన తర్వాత హరి కోసం పడుతున్నది తెలంగాణ తెచ్చినోళ్ళే అని అన్నారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అన్ని పార్టీలతొ కలిసి ఉద్యమంలో పాల్గొన్న సంగతి గుర్తు చేశారు. బిజెపి టీఆర్ఎస్ కాంగ్రెస్ సిపిఐ మందకృష్ణ మాదిగ గద్దర్ విమలక్క ప్రొఫెసర్ కోదండరాం ఇలా అందరితో కలిసి పని చేసిన సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణలో బహుజన బతుకమ్మ ప్రారంభించింది తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అని గుర్తు చేశారు. పదేళ్ల తెలంగాణలో జర్నలిస్టులు ఎక్కువగా నష్టపోయారన్నారు కెసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 5000 కిలోమీటర్ల బస్సు యాత్ర భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా జర్నలిస్టు చేసిన యాత్రగా నిలిచిపోయిందని అందులోనే ధరణి సమస్యలు మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ నిర్వాసితుల న్యాయం జరగాలని పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. న్యాయవాదుల జంట హత్య పై పోరాడమని జర్నలిస్టు సంఘాల పేరుతో సొంత లాభం కోసం పని చేసుకునే నాయకులం కాదన్నారు సమస్య వచ్చిన తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ముందుండి పోరాటం చేస్తున్న సంగతి గుర్తు చేశారు తెలంగాణలో ఆంధ్ర పత్రికల పెత్తనం ఏందని ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి తెలంగాణ పత్రికలకు సరైన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు జర్నలిస్టులు గొంతమ్మ కోరికలు కోరడం లేదని ఇల్లు విద్యా వైద్యం అందిస్తే సరిపోతుందని అన్నారు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర అధ్యక్షులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ డబ్ల్యూ జె జాతీయ ఉపాధ్యక్షులు పెద్దాపురం నరసింహ రాష్ట్ర కార్యదర్శులు కనకారెడ్డి, బాబురావు, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య, మెదక్ జిల్లా అధ్యక్షులు పి రామయ్య, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు దిలీప్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రసాద్, సంగారెడ్డి జిల్లా ప్రదాన కార్యదర్శి రమేష్ గౌడ్, ఉపధ్యక్షులు కనకయ్య, మహిపాల్ రెడ్డి, కార్యదర్శి మలేష్, కార్యవర్గసభ్యులు గందమల స్వామి, రానోజ్ ప్రదీప్, ఎం. దశరథ్, మహేష్ గౌడ్, ఎం డి జావేద్,తదితరులు పాల్గొన్నారు.

Related posts

రైస్ మిల్లుల కాలుష్యం నుండి ప్రజలను కాపాడాలి

Harish Hs

మూడవ జిల్లా మహాసభల కరపత్రాలు ఆవిష్కరణ

Harish Hs

నేటి సాంకేతికత రేపటికి సాంకేతికత కు పునాది  ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది… జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు  బాల వైజ్ఞానిక ప్రదర్శనలు సృజనాత్మకతకు ప్రతీకలు ఉపాధ్యయులు ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలి  కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ సహకారంతో వైజ్ఞానిక ప్రదర్శన విజయవంతం భళా… బాలల సైన్స్ ప్రయోగాలుజిల్లా విద్యాశాఖ చరిత్రలో కోదాడ విద్యా బాల వైజ్ఞానిక ప్రదర్శన మైలు రాయి….డీఈఓ అశోక్

TNR NEWS

పండ్ల వ్యాపారస్తులు ఐక్యంగా. ఉండాలి

Harish Hs

క్రీడాకారులను అభినందించిన రాజేష్

TNR NEWS

విద్యా హక్కు చట్టం అమలు చేయండి – సమాచార హక్కు చట్టం సాధన కమిటీ – వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్

TNR NEWS