Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్పుణ్యక్షేత్రాలు

కాకినాడగణపతిపీఠంలో 53మంది ఉపవాసకులతో ఘనంగా జరిగిన మాఘ సంకష్టహర చతుర్థి

కాకినాడ : స్వయంభు కాకినాడ భోగిగణపతి పీఠంలో మాఘమాస సంకష్ట హరచతుర్ధి మాసోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 53మంది చతుర్థి ఉపవాసకులు ప్రత్యేక పూజలు చేసారు. 13వ చతుర్థి సందర్భంగా మంగళ వాయిద్యాల నడుమ జై గణేశ జయము జయము పరమేశ్వర నామాలతో నగర సంకీర్తన సహస్ర నామ పారాయణ చేశారు. పంచామృతాలతో గణపతిని అభిషేకించి, అఖండ హారతి అందించారు. నల్లద్రాక్షలతో పాలవెల్లిని నిలిపి తరుణ గణపతిని ప్రతిష్టించారు. మాఘ మాసంలో సంకష్ట హార చతుర్థి ఉపవాస వ్రత పూజవలన సర్వ దేవతల వ్రత యజ్ఞ యాగ ఫలాలతో బాటుగా జన్మించిన జీవిత లక్ష్యసాధనకు పరమార్థ సార్థకమైన వరప్రదాయక ఏకాగ్రత కార్యసిద్ధి కలుగుతుందని పీఠం తెలియజేసింది. చంద్రునికి ఆర్ఘ్యంతో నీరాజనాలు సమర్పించిన వ్రతదీక్ష ఉపవాసకులకు అల్పాహార సమారాధన ఏర్పాటు చేశారు. స్వయంభువుకి పంచలోహాల తాపడంతో కాంస్య కవచ యజ్ఞం జరిగిన సందర్భగా 24 నెలల పాటు ఉపవాసకులతో చతుర్థి మాసోత్సవాలు ప్రత్యేకంగా జరుగుతున్నాయని పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు.

Related posts

ప్రభుత్వాసుపత్రిని కాకినాడ జిల్లాకు పరిమితం చేయాలి

కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేజ్రీవాల్

TNR NEWS

శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు 

TNR NEWS

పిఠాపురంలో నిర్వాసిత బడ్డీ యజమానులకు.. పి4 ప్రణాళికగా జనతా దుకాణాలు నిర్మించాలి

Dr Suneelkumar Yandra

రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాలలో బండారు శ్రీనివాస్ విస్తృత ప్రచారం

Dr Suneelkumar Yandra

బ్రహ్మ కడిగిన శ్రీవారి పాదాలు