Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

ఆరోగ్య భీమా ప్రీమియంపై జిఎస్టి భారం తగ్గించాలి – పౌర సంక్షేమ సంఘం డిమాండ్

కాకినాడ : ఆరోగ్య భీమా ప్రీమియం సామాన్యుడికి మధ్య తరగతికి అందనంత ఖరీదైన ప్రక్రియగా మారుతున్నదని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. వైద్య చికిత్స భారం కావడం వలన ఆరోగ్య భీమా ప్రీమియం 15 నుండి 20 శాతం పెరుగుతుండడం వలన ఆందోళన చెందుతున్న ప్రభావం ఏర్పడిందన్నారు. భీమాపై 18శాతం జిఎస్టి వస్తు సేవల పన్ను విధించడం వలన పాలసీదారులకు ఉపశమనం దక్కడంలేదన్నారు. కొందరు వీటిని భరించలేక పాలసీలను వదిలేస్తున్న దుస్థితి వుందన్నారు. తీవ్ర భారం కావడం వలన ప్రయివేటు సంస్థల్లోని ఉద్యోగులు స్వంతంగా పాలసీ తీసుకునే అవకాశం చేయకపోవడంతో ఉద్యోగం కోల్పోయిన సందర్భాల్లో భీమా రక్షణ దక్కడం లేదన్నారు. భీమా పాలసీ చేసిన ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెరిగే కొద్దీ ప్రీమియం రేటు పెరగడం వలన జీవన పొదుపు చేసుకోలేని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. జిఎస్టి భారాన్ని 5 శాతం మించకుండా విధించే ప్రక్రియను ప్రభుత్వం వహించాలని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు డిమాండ్ చేశారు. లేకుంటే ఆరోగ్య భీమా అన్ని వర్గాలకు అందని వైద్యంగా వుంటుందన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

చిల్లపల్లి ఆధ్వర్యంలో పిఠాపురం.. జయకేతనం సభాప్రాంగణం వద్ద స్వచ్ఛభారత్

Dr Suneelkumar Yandra

ఘనంగా బాబూ జగజ్జీవన్ రామ్ జన్మదిన వేడుకలు

కేంద్రమంత్రితో సీఎం చంద్రబాబు భేటీ

TNR NEWS

మెరుగైన ప్రజా జీవితానికి మెరుగైన మౌలిక సదుపాయాలె పునాది

TNR NEWS

జనసేన ఆవిర్భావ దినోత్సవసభను విజయవంతం చేయాలి – కొత్తపేట నియోజకవర్గం ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ పిలుపు

Dr Suneelkumar Yandra

చిల్డ్రన్ మరియు యూత్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్

Dr Suneelkumar Yandra